• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆసుపత్రిపై దాడి: మోదీ తీవ్ర దిగ్భ్రాంతి

    గాజాలో ఆసుపత్రి దాడి ఘటనపై భారత ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అల్ అహ్లీ ఆసుపత్రిలో ప్రాణనష్టంపై బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఇజ్రాయెల్-హమాస్ మధ్య కొనసాగుతున్న ఘర్షనల్లో సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ ఆసుపత్రిపై దాడిలో దాదాపు 500 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిని ప్రపంచదేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.

    అంధకారంలోకి ఇజ్రాయెల్

    ఇజ్రాయెల్‌లో గాజాపై హమాస్ ఉగ్రవాదుల భీకర దాడులను కొనసాగుతున్నాయి. హమాస్‌ విలిటెంట్లు కేంద్రంగా చేసుకున్న అనేక స్థావరాలపై ఇజ్రాయెల్‌ రక్షణ బలగాలు దాడులకు తెగబడుతున్నాయి. ఈ క్రమంలో గాజాలో విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం మూతపడింది. గాజాను అష్ట దిగ్బంధం చేసిన ఇజ్రాయెల్‌.. విద్యుత్తు, ఆహారం, ఔషధాలతోపాటు ఇంధన సరఫరాను నిలిపేసింది. దీంతోపాటు గాజా సరిహద్దులన్నింటినీ మూసివేయడంతో.. విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రానికి, ఇళ్లు, కార్యాలయాల్లో వాడే జనరేటర్లకు ఇంధనం తీసుకురావడం అసాధ్యంగా మారింది.