23-26 తేదీల మధ్య భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం స్థిరంగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపటికి ఇది వాయుగుండంగా మారుతుందని వెల్లడించింది. క్రమంగా బలపడి ఈనెల 22నాటికి తుపాన్గా బలపడుతుందని పేర్కొంది. అయితే తుపాన్ ఎక్కడ తీరం దాటుతుందనే దానిపై స్పష్టత లేదని వివరించింది. 22 నాటికి దీనిపై క్లారిటీ వస్తుందని తెలిపింది. తుపాన్ ప్రభావంతో 23-26 తేదీల మధ్య భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గంటకు 45కి.మీ.వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అంచనా వేసింది.