• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సైనికుడిని కాపాడేందుకు ఆర్మీ శునకం ప్రాణ త్యాగం

    ఉగ్రవాదుల దాడిలో సైనికుడిని రక్షించే క్రమంలో భారత ఆర్మీకి చెందిన కెంట్ అనే శునకం(6) ప్రాణాలు కోల్పోయింది. నిన్న జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీలో సెర్చ్‌ ఆపరేషన్‌ చేపడుతున్న బృందం.. కెంట్‌ను తీసుకువెళ్లింది. ఉగ్రమూకను పసిగట్టిన కెంట్ సైన్యాన్ని అప్రమత్తం చేసింది. ఈ క్రమంలో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఓ సైనికుడిని ఉగ్రవాదులు చుట్టుముట్టేందు వస్తున్న క్రమంలో వారికి కెంట్ ఎదురెళ్లింది. దీంతో ఉగ్రవాదుల కాల్పుల్లో శునకం తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయింది. https://x.com/ANI/status/1701784499481362778?s=20

    దూసుకొచ్చిన మంచు ప్రవాహం

    జమ్ము, కశ్మీర్‌ను మంచుదుప్పటి కప్పేసింది. అక్కడ ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీలకు పడిపోవడంతో ప్రజలు వణికిపోతున్నారు. తాజాగా గందర్‌బాల్ జిల్లాలో తీవ్ర హిమపాతం చోటు చేసుకుంది. సోనామార్గ్ ఏరియా పరిధిలోని జొజిలా, బల్తార్ ప్రాంతాల సమీపంలో మంచు ప్రవాహం దూసుకొచ్చింది. కొండపై నుంచి ఒక్కసారిగా జాలువారుతూ పరిసరాలను మంచుతో కప్పేసింది. అంతేగాకుండా భారీ ఎత్తున పైగి ఎగసింది. దీంతో మంచు ప్రవాహంలో చిక్కుకోకుండా అక్కడున్న పక్షులు బయటకి ఎగిరిపోయాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాల్లో చక్కర్లు కొడుతోంది. #WATCH | Jammu and Kashmir: … Read more