• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • టీడీపీ, జనసేన విజయం ఖాయం: భువనేశ్వరి

    2024లో టీడీపీ-జనసేన కూటమి అఖండ విజయం సాధిస్తుందని చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ధీమా వ్యక్తం చేశారు. ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ‘దివంగత నేత ఎన్టీఆర్‌ తెలుగు ప్రజలకు ఆత్మగౌరవం తీసుకొస్తే.. చంద్రబాబు వారిలో ఆత్మవిశ్వాసం నింపారు. అలాంటి వ్యక్తిని 49 రోజులుగా జైల్లో పెట్టారు. ఆయన చేసిన నేరం ఏమిటో ఆధారాలు ,చూపించండి’. అని భువనేశ్వరి ప్రశ్నించారు.

    రాష్ట్రాన్ని, న్యాయాన్ని నిర్భంధించారు: భువనేశ్వరి

    టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చంద్రగిరిలో నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..చంద్రబాబుపై మోపిన స్కిల్‌, రింగ్‌రోడ్డు, ఫైబర్‌నెట్‌ కేసులో ఏం ఆధారాలు ఉన్నాయని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి రాష్ట్రాభివృద్ధి గురించి ఏ మాత్రం ధ్యాస లేదని విమర్శించారు. రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు ఎంతో కష్టపడ్డి పనిచేశారని చెప్పారు. రాష్ట్రాన్ని, న్యాయాన్ని జైలులో నిర్భంధించారని భువనేశ్వరి అన్నారు.