• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అప్పులు తప్ప అభివృద్ధి లేదు: పురందేశ్వరి

    ఏపీ ప్రభుత్వంపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వానికి అప్పులు చేయడంపై ఉన్న శ్రద్ధ అభివృద్ధి చేయడంలో లేదన్నారు. పేదలకు గృహాలు, సంక్షేమ పథకాలను కేంద్రమే అందిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కేంద్ర నిధులతోనే జరుగుతోందని తెలిపారు. ఆ నిధులను తమ నిధులుగా చెప్పుకుంటూ వైసీపీ గొప్పలకు పోతుందని విమర్శించారు. ఏపీ రాజధాని అమరావతికి పెద్ద ఎత్తున కేంద్రం నిధులు మంజూరు చేసిందని పురందేశ్వరి పేర్కొన్నారు.

    అక్రమాలపై ప్రశ్నిస్తే కోవర్టు అంటారా?: పురందేశ్వరి

    ఏపీ ప్రభుత్వంపై ఆ రాష్ట్రం బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఫైరయ్యారు. వైసీపీ అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే టీడీపీ కోవర్టు అంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఫల్యాలను ప్రశ్నిస్తే గొంతు నొక్కుతారా అని మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలపై కేంద్రానికి ఫిర్యాదు చేశామని చెప్పారు. కేంద్రం పథకాలకు వైసీపీ పేర్లు పెట్టుకోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో బీజేపీ, జనసేన మధ్య పొత్తు కొనసాగుతుందన్నారు. పొత్తు లేకుంటే 175 స్థానాలకు బీజేపీ పోటీలో ఉంటుందని పురందేశ్వరి పేర్కొన్నారు.

    ‘పురందేశ్వరి ఏ పార్టీయే అర్థం కావట్లేదు’

    ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరిపై డిప్యూటి సీఎం నారాయణ స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. పురందేశ్వరి ఏ పార్టీయో నాకు అర్థం కావడంలేదు.. చంద్రబాబును కాపాడుకునే తపన తప్ప వేరేది కనబడటం లేదు. ప్రధాని నరేంద్ర మోదీయే చంద్రబాబు అవినీతిపై మాట్లాడితే ఈమె వెనకేసుకొస్తోంది. లోకేష్‌ను వెంటబెట్టుకుని అమిత్ షా దగ్గరకు తీసుకెళ్లడం విడ్డూరంగా ఉంది. మొన్నటి వరకు బీజేపీని ఇష్టారీతిన తిట్టిన టీడీపీ నాయకులతో జతకట్టడం వింతగా ఉంది అంటూ కామెంట్స్ చేశారు.