• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • యుద్ధ ప్రాతిపదికన పనురుద్ధరణ పనులు

    AP: రైలు ప్రమాదం జరిగిన విజయనగరం జిల్లా భీమాలి వద్ద ట్రాక్‌ పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. బోగీలను తొలగించేందుకు విశాఖ నుంచి బాహుబలి క్రేన్‌ను తీసుకొచ్చారు. ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 7 సహాయ బృందాలు నిరంతరాయంగా శ్రమిస్తున్నాయి. పలాస ప్యాసింజర్‌లోని 11 బోగీలను అలమండ స్టేషన్‌కు, రాయగడ ప్యాసింజర్‌ 9 బోగీలను కంటకాపల్లి స్టేషన్‌కు తరలించారు. సహాయ చర్యల్లో దక్షిణ మధ్య రైల్వే, వాల్తేరు, తూర్పు కోస్తా రైల్వే సిబ్బందితో పాటు NDRF, SDRF, RPF బలగాలు పాల్గొన్నాయి. Thirteen … Read more

    రైలు ప్రమాద స్థలికి సీఎం జగన్

    AP: విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం నేపథ్యంలో ఘటనాస్థలికి సీఎం జగన్‌ వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన అక్కడికి చేరుకోనున్నారు. విమానంలో తాడేపల్లి నుంచి విశాఖ వెళ్లనున్న జగన్‌, అక్కడి నుంచి హెలికాప్టర్‌లో అలమండ వెళ్తారు. అలమండ నుంచి ప్రత్యేక రైలులో వెళ్లి ప్రమాదస్థలిని పరిశీలించనున్నారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం విజయనగరం ప్రభుత్వాసుపత్రికి వెళ్లి బాధితులను జగన్‌ పరామర్శిస్తారు.

    ఘోరం.. 14 మంది దుర్మరణం

    AP: విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో 14 మంది దుర్మరణం చెందారు. 33 మందికి గాయాలైనట్లు అధికార వర్గాలు ప్రకటించాయి. కొత్తవలస మండలం కంటకాపల్లి-అలమండ మధ్య ఆదివారం రాత్రి ట్రాక్‌పై ఉన్న రైలును వెనకనుంచి మరో రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో క్షతగాత్రుల సంఖ్య వంద మందికిపైనే ఉంటుందని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. మృతుల సంఖ్య కూడా పెరిగేలా పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పాయి. ఈ ప్రమాదంలో మెుత్తం ఏడు బోగీలు నుజ్జు నుజ్జు అయినట్లు వివరించాయి. Vizianagaram DRO confirms that eight … Read more