శ్రీవారికి కాసుల వర్షం; ఎన్ని కోట్లంటే?
తిరుమల శ్రీవారికి హుండీకి జనవరి నెలలో కాసుల వర్షం కురిసింది. ఆ నెలలో మొత్తం 20,58,242 మంది భక్తులు వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. 122.68 కోట్లు హుండీ కానుకలు సమర్పించారు. జనవరి 2 ఏకంగా ఆలయ చరిత్రలోనే అత్యధికంగా రూ.7.68 కోట్ల కానుకలు వేశారు. కాగా గత 10 నెలలుగా నెలకు రూ.100 కోట్ల హుండీ ఆదాయం వస్తోంది. హుండీ ఆదాయంతో పాటు లడ్డూ విక్రయాలు, కళ్యాణకట్ట, కళ్యాణమండపాల ద్వారా కూడా టీటీడీకీ భారీ ఆదాయం వస్తోంది.