భక్తుల గమ్యస్థానంగా తిరుపతి
దేశంలోనే భక్తులు అత్యధికంగా దర్శించుకునే రెండో పుణ్యక్షేత్రంగా తిరుపతి నిలిచినట్లు ఓయో కల్చరల్ ట్రావెల్ రిపోర్ట్ తెలిపింది. మొదటి స్థానంలో వారణాసి ఉన్నట్లు వెల్లడించింది. లాక్డౌన్ నిబంధనలు సడలించడంతో శ్రీవారిని దర్శించుకోవాడానికి భక్తులు పోటెత్తుతున్నట్లు పేర్కొంది. తిరుపతి తర్వాతి స్థానాల్లో పూరి, అమృత్సర్, హరిద్వార్, షిర్డీ, రిషికేష్, మధుర, మహాబలేశ్వర్, మధుర క్షేత్రాలు నిలిచినట్లు వెల్లడించింది.