• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • టీచర్‌తో ప్రేమ.. పదో తరగతి విద్యార్థి హత్య

    ఓ టీచర్‌ వద్ద ట్యూషన్ చదువుకుంటున్న పదోతరగతి విద్యార్థిని ఆమె ప్రియుడు హత్య చేశాడు. విద్యార్థిని కిడ్నాన్ చేసిన హత్యచేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. రచిత అనే 21 ఏళ్ల యువతి కాన్పూర్‌లో ట్యూషన్‌ నడుపుతోంది. అక్కడ 17 ఏళ్ల విద్యార్థి చదువుకోవడానికి ఆమె దగ్గరకి వెళ్తుంటాడు. వీళ్లిద్దరి మధ్య ప్రేమ ఉందన్న అనుమానించిన ఆమె ప్రియుడు ప్రభాత్‌ శుక్లా.. బాలుడ్నికిడ్పాప్ చేసి హత్యచేశాడు. ప్రేమ వ్యవహారమే కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

    మొసలిని భుజాలపై ఎత్తుకొన్న యువకుడు

    ఓ యువకుడు మొసలిని భుజాలపై మోస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాజ్‌వారా అనే గ్రామంలోని ఓ చెరువులో మొసలి కనిపించింది. దీంతో గామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఇద్దరు యువకుల సహాయంతో అధికారులు మొసలిని తాళ్లతో బంధించారు. మొసలిని అమాంతం తన భుజాలపై ఎత్తుకున్న ఓ యువకుడు 300 మీటర్ల దూరంలో ఉన్న అటవీశాఖ వాహనం వద్దకు చేర్చాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

    కీచక టీచర్: విద్యార్థినిపై లైంగిక వేధింపులు

    విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఐదో తరగతి చదువుతున్న చిన్నారులపై పైశాచికంగా ప్రవర్తించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉధ్యాయుడు ఐదో తరగతి బాలికలను లైంగికంగా వేధించాడు. ఆ చిన్నారిపై లైంగిక యత్నం చేశాడు. దీన్ని ఎవరికీ చెప్పకుండా ఉండేందుకు చిన్నారికి కొంత డబ్బును ఇచ్చాడు. ఉపాధ్యాయుడి వేధింపులు తాళలేని చిన్నారి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ దుశ్చర్య వెలుగులోకి వచ్చింది.

    టీచర్‌పై విద్యార్థులు కాల్పులు

    ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు స్కూల్ విద్యార్థులు రెచ్చిపోయారు. తమ స్కూల్ టీచర్‌పై గన్‌తో కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయి ఓ వీడియో సందేశాన్ని పంపించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. కోచింగ్ సెంటర్లో పాఠాలు చెబుతున్న టీచర్‌ను విద్యార్థులు బయటకు రమ్మని పిలిచారు. వెంటనే అక్కడకు వచ్చిన టీచర్‌పై సదరు విద్యార్థులు వరస కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. కాలికి బుల్లెట్ గాయం కావడంతో టీచర్‌ను ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    మద్యం మత్తులో ప్రయాణికులపై మూత్ర విసర్జన

    మద్యం మత్తులో ఓ వ్యక్తి రైల్లో తోటి ప్రయాణికులపై మూత్ర విసర్జనకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ సంవర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో చోటు చేసుకుంది. ఓ యువకుడు ఫుల్‌గా మద్యం సేవించి ఏసీ కోచ్‌లో పై బెర్త్‌లో పడుకుని ఉన్నాడు. ఈ క్రమంలో లోయర్ బెర్త్‌లో పడుకుని ఉన్న ఇద్దరు దంపతులపై వారి వస్తువులపై మూత్ర విసర్జనకు పాల్పడ్డాడు. దీంతో తోటి ప్రయాణికులు వెంటనే టీటీఈకి సమాచారం అందించారు. నిందితుడిని పట్టుకుని ఓ రైల్వే స్టేషన్‌లో పోలీసులకు అప్పగించారు.