• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కొండపోచమ్మసాగర్‌ను పరిశీలించిన పంజాబ్ సీఎం

    [వీడియో;](url) పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ తెలంగాణలో పర్యటిస్తున్నారు. సిద్ధిపేట జిల్లాలో ఉన్న గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మసాగర్‌ను ఆయన పరిశీలించారు. ప్రాజెక్టు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొండపోచమ్మ పంపు హౌజ్, తొగుటలోని మల్లన్నసాగర్, గజ్వేల్ పాండవుల చెరువు, నర్సన్నపేట చెక్‌డ్యామ్‌లను భగవంత్ సందర్శించనున్నారు. అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకుని సీఎం కేసీఆర్‌తో సమావేశమవుతారు. ਤੇਲੰਗਾਨਾ ਵਿਖੇ ਡੈਮ ਦਾ ਨਿਰੀਖਣ ਕਰਨ ਮੌਕੇ CM #BhagwantMann ਜੀ Live https://t.co/Q30FL560qO — AAP Punjab (@AAPPunjab) February 16, 2023

    కోలుకుంటున్న తారకరత్న; ఎంపీ విజయసాయిరెడ్డి

    నందమూరి తారకరత్న కోలుకుంటున్నట్లు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. బెంగళూరులోని హృదయాలయ ఆస్పత్రికి వెళ్లి తారకరత్న ఆరోగ్య పరిస్థితిని విజయసాయి తెలుసుకున్నారు. బాలకృష్ణ అక్కడే ఉండి తారకరత్నను జాగ్రత్తగా చూసుకుంటున్నాడని చెప్పారు. కాగా తారకరత్నకు విజయసాయిరెడ్డి మామ వరుస అవుతారు. తారకరత్న భార్య అలేఖ్య రెడ్డికి విజయసాయిరెడ్డి పెదనాన్న అవుతారు. విజయసాయిరెడ్డి భార్య సునంద చెల్లెలి కూతురే అలేఖ్య.

    ఎల్బీనగర్‌లో శ్రీలీల సందడి

    ‘ధమాకా’ ఫేం శ్రీలీల హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో సందడి చేసింది. వాసవీ ఆనంద నిలయం గేటెడ్ కమ్యూనిటీ ప్రారంభోత్సవానికి శ్రీలీల అతిథిగా హాజరైంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పిక్స్ వైరల్‌గా మారాయి. కాగా శ్రీలీల ఇటీవల విడుదలైన ధమాకా బ్లాక్‌బస్టర్ అందుకుంది. ఈ సినిమా విజయంతో ఈ కన్నడ భామకు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం నవీన్ పొలిశెట్టి సరసన ‘అనగనగా ఒక రాజు’, రామ్ పోతినేతితో ఓ సినిమా, పంజా వైష్ణవ్‌తో మరో సినిమా చేస్తోంది. Courtesy Twitter: Sharat Chandra Boggarapu … Read more

    శ్రీవారి సేవలో జాన్వీ కపూర్

    దివంగత శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ సమయంలో ఆమె స్వామివారిని దర్శించుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో ఆమె దర్శనానికి వచ్చారు. ఆలయ సిబ్బంది జాన్వీకి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కాగా జాన్వీ కపూర్ రావడంతో తిరుమలలో సందడి నెలకొంది. ఆమెతో సెల్ఫీలు దిగేందుకు భక్తులు ఎగబడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.