• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘వాల్తేరు వీరయ్య’ వీక్షించిన వైసీపీ ఎమ్మెల్యే

    AP: శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు చురకలంటించారు. అన్నయ్యను చూసి తమ్ముడు నేర్చుకోవాలంటూ పరోక్షంగా విమర్శించారు. వాల్తేరు వీరయ్య సినిమాను వీక్షించిన అనంతరం మధుసూధన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘చిన్నప్పటి నుంచి అభిమానిగా సినిమాలు చూస్తున్నాం. ఇప్పుడు కార్యకర్తలతో కలిసి వాల్తేరు వీరయ్య సినిమా చూడటం ఆనందంగా ఉంది. అన్నదమ్ముల అనుబంధంతో సినిమా చాలా బాగుంది. అన్నయ్యను చూసి తమ్ముడు నేర్చుకోవాలి’ అంటూ కామెంట్స్ చేశారు. దీంతో పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారంటూ నెట్టింట్లో … Read more

    పవన్ కళ్యాణ్ ఒక పొలిటికల్ జోకర్: రోజా

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్రలో మంత్రులను తిట్టడానికే పవన్‌ సభ పెట్టారు. ఆయన్ను ఏమనాలో కూడా అర్థంకావడం లేదు. ఆయనోక పొలిటికల్ జోకర్. సంక్రాంతి పండగకు చిరంజీవికి వాల్తేరు వీరయ్య కలెక్షన్లు, బాలయ్యకు వీరసింహారెడ్డి కలెక్షన్లు వస్తే పవన్‌కు చంద్రబాబు నుంచి ప్యాకేజీ వచ్చింది అంటూ ఎద్దేవా చేశారు.

    మీరిచ్చే టీ తాగను, విషం కలిపిస్తే : అఖిలేష్‌

    [VIDEO:](url) సమాజ్‌వాద్‌ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. ఎస్పీ ట్విటర్‌ హ్యాండిల్‌ చేసే వ్యక్తిని అరెస్ట్‌ చేయడంతో అతడిని విడుదల చేయాలని అఖిలేశ్‌ పోలీస్‌ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. అక్కడ వారు ఇచ్చిన టీ తాగేందుకు నిరాకరించారు. “ నాకు పోలీసుల మీద నమ్మకం లేదు. టీలో విషం కలిపి ఇస్తారేమో. నేను బయటి నుంచి తెప్పించుకుంటాను. అవసరమైత కప్పు తీసుకుంటాను “ అన్నారు. #WATCH समाजवादी पार्टी प्रमुख अखिलेश यादव … Read more

    రోజా.. అది నోరా.. కుప్పతొట్టా? సినీనటుడు నాగబాబు

    ఏపీ పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజాపై జనసేన నాయకుడు, సినీనటుడు నాగబాబు మండిపడ్డారు. తన సోదరులు చిరంజీవి, పవన్ కల్యాణ్‌ను విమర్శించడంపై రోజాపై ధ్వజమెత్తారు. ‘‘రోజా.. నీది నోరా.. [కుప్పతొట్టా](url)’’ అని ఎద్దేవా చేశారు. పర్యాటక శాఖ మంత్రి అంటే పర్యటనలు చేయడం కాదని.. ఆ శాఖను ఎలా అభివృద్ధి చేయాలో నేర్చుకోమని హితవు పలికారు. రోజా మంత్రి పదవి నుంచి దిగిపోయేసరికి పర్యాటక రంగం సర్వనాశనం అయిపోతుందని చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో ట్రెండింగ్‌లో ఉంది. #KuppaThottiRoja https://t.co/Y1ri1JB8QW — satyam (@SatyamAmp) … Read more

    దిల్లీ మేయర్‌ ఎన్నిక గందరగోళం

    [VIDEO:](url) దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక రసాభాసగా మారింది. మేయర్‌ ఎన్నికకు సంబంధించి ప్రిసైడింగ్‌ అధికారి నియామకంలో లెఫ్టినెంట్ గవర్నర్‌పై ఆప్‌ విమర్శలు చేస్తూ నిరసనకు దిగింది. ఈ క్రమంలో ఆప్‌, భాజపా నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. స్వల్పంగా తోపులాట జరగటంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో భాజపా కంచుకోటను బద్ధలు కొడుతూ ఆప్‌ 134 స్థానాల్లో విజయం సాధించింది. కమలం పార్టీకి 104 స్థానాలు దక్కాయి. #WATCH | Delhi: Chaos continues at Civic Center … Read more

    కుప్పంలో రెండో రోజు బాబు పర్యటన; ఏం జరుగుతుందో?

    టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్నారు. పర్యటన తొలి రోజు పోలీసుల నుంచి అడుగడుగునా [ఆంక్షలు](url) ఎదుర్కొన్నారు. నేడు ఆయన నియోజకవర్గంలో ఎలా, ఎక్కడ పర్యటిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఓ వైపు ఈ రోజు మొత్తం పార్టీ కేడర్‌తో భేటీకి కేటాయించారు. బూత్‌ల వారీగా కార్యకర్తలతో సమావేశం అవుతారు. కాగా చంద్రబాబుకు సంబంధించిన ప్రచార రథాన్ని కుప్పం పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. Police deny permission for #ChandrababuNaidu#Chandrababu angrily questioned, "I am the … Read more

    అన్నా చెల్లెలి అనురాగం; రాహుల్, ప్రియాంకల వీడియో వైరల్

    కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో అపురూప సన్నివేశం చోటుచేసుకుంది. అన్నాచెల్లెళ్లు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఒకే వేదిక పంచుకున్నారు. ప్రియాంకను దగ్గరకు లాక్కొని రాహుల్ [ముద్దు](url) పెట్టాడు. ఈ సన్నివేశం వారిద్దరి అనురాగానికి అద్దం పట్టేలా ఉంది. కాగా తన సోదరుడు బహిరంగంగా ఆప్యాయత పంచడంతో ప్రియాంక కొంత ఇబ్బంది పడింది. ప్రియాంక కాసేపు నవ్వాపుకోలేక పోయింది. కాగా జోడో యాత్ర ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతోంది. ❤️❤️ pic.twitter.com/9MIQKMIdAQ — Congress (@INCIndia) January 3, … Read more

    మాజీ సీఎం ఇంటికి నిప్పు; త్రిపురలో ఉద్రిక్తత

    త్రిపుర మాజీ సీఎం, బీజేపీ నేత బిప్లబ్ కుమార్ దేబ్ ఇంటికి దుండగులు నిప్పంటించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయ్‌పూర్‌లో ఉన్న రాజ్‌నగర్‌లోని బిప్లబ్ ఇంట్లో తన తండ్రి వర్థంతి కార్యక్రమాలు జరుగుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడ్డారు. ఇంటిని ధ్వంసం చేసి బయట ఉన్న వాహనాలకు [నిప్పు](url) పెట్టారు. దీంతో పోలీసులు భారీగా మోహరించి భద్రత పర్యవేక్షిస్తున్నారు. కాగా ఈ దాడి వెనుక కక్రాబన్ ఎమ్మెల్యే రతన్ చక్రవర్తి ఉన్నట్లు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. Former Tripura CM Biplab Deb’s … Read more

    రాహుల్‌‌కి కవచం ఉంది: ప్రియాంకా గాంధీ

    తన సోదరుడు రాహుల్ గాంధీ ‘సత్య కవచములు’ కలిగి ఉన్నాడని.. దేవుడే రాహుల్‌కి కాపు కాస్తున్నాడని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ వ్యాఖ్యానించారు. ‘‘అందరూ నన్ను అడుగుతున్నారు. ‘ఏంటీ మీ అన్నయ్య కేవలం ఒక టీషర్టుతోనే పాదయాత్ర చేస్తున్నారు. చలి వేయట్లేదా? పైగా పంజాబ్, జమ్ము కశ్మీర్‌లకు వెళ్లబోతున్నారు.. భద్రతను పెంచుకోవచ్చు కదా!’ అని. అప్పుడు నేను ‘ఆయన సత్యం అనే కవచాన్ని ధరించాడు. దేవుడే రక్షణ కల్పిస్తున్నాడు’ అని వాళ్లకి చెప్పాను’’ అని ప్రియాంకా గాంధీ వెల్లడించారు. ఇదే అంశంపై రాహుల్ గాంధీ … Read more

    వైసీపీ కోసం 70 ఎకరాలు అమ్ముకున్నా; జెడ్పీటీసీ ఆవేదన

    వైఎస్సార్‌సీపీ కోసం 70 ఎకరాలు అమ్ముకున్నానని ఓ ప్రజాప్రతినిధి వాపోయాడు. ఏపీలోని పల్నాడు జిల్లా బెల్లంకొండ జెడ్పీటీసీ గాదె వెంకటరెడ్డి తన ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఉన్న 120 ఎకరాల్లో 70 ఎకరాలు అమ్ముకుని పార్టీకి ఖర్చు చేసినా తనకు కనీస గౌరవం ఇవ్వడం లేదన్నారు. తన భార్య నగలు తాకట్టు పెట్టి థియేటర్‌లో [‘యాత్ర](url)’ మూవీ ఆడించానని తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యేకు తన గోడు వెళ్లబోసుకున్నా ఫలితం లేదన్నారు. ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదని వాపోయారు. Future … Read more