మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ విశాఖలో ఘనంగా జరుగుతోంది. ఆంధ్రా యూనివర్సిటీలో కార్యక్రమానికి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ ఇద్దరు కలిసి వేడుకకు హాజరయ్యారు. శృతిహాసన్కు అనారోగ్యం కారణంగా రాలేదని తెలుస్తోంది. చిత్రానికి బాబి దర్శకత్వం వహించగా…దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. జనవరి 13న సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నారు.