స్టార్ హీరోయిన్ రష్మిక (Rashmika Mandanna)ను సోషల్మీడియాలోని ఆకతాయిలు మరోసారి టార్గెట్ చేశారు. ఇప్పటికే ఆమెపై ఓ మార్ఫింగ్ వీడియోను క్రియేట్ చేసి ఇబ్బందిపెట్టగా తాజాగా మరో డీప్ ఫేక్ వీడియోను సృష్టించారు.
ఇందులో ఆమె జిమ్ సూట్ ధరించి డ్యాన్స్ చేస్తున్నట్లు చూపించారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన ఈ వీడియోపై రష్మిక అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఫేక్ వీడియో అని.. దీనిని ఎవరూ నమ్మొద్దని పోస్టులు పెడుతున్నారు.
![](https://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/11/10160149/F-gPOt_bIAAX1iY-693x1024.jpg)
ఇటీవల సోషల్మీడియా ఇన్ఫ్లుయేన్సర్ జారా పటేల్ వీడియోకు రష్మిక ముఖాన్ని ఉపయోగించి వీడియో క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది.
![](https://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/11/10165103/F-daJbiagAA5pPm-890x1024.jpg)
రష్మిక ఫేక్ వీడియోపై అమితాబ్ బచ్చన్, కీర్తిసురేశ్, నాగచైతన్య, విజయ్ దేవరకొండతోపాటు పలువురు సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
![](https://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/11/10165159/F-VA1OmWMAA3pqp-782x1024.jpg)
ఇదిలా ఉంటే.. 2016లో కన్నడలో వచ్చిన కిర్రాక్ పార్టీ సినిమాతో రష్మిత సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ చిత్రం కన్నడలో భారీ వసూళ్లను రాబట్టింది. ఆ తర్వాత ‘అంజనీ పుత్ర’, ‘చమక్’ వంటి కన్నడ చిత్రాల్లో ఈ భామ మెరిసింది.
![](https://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/11/10160219/F-jcClZbwAAOdmz-572x1024.jpg)
2018లో వచ్చిన ‘ఛలో’ సినిమాతో రష్మిక తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ సినిమా భారీ విజయం సాధించడంతో రష్మికకు మంచి పేరు వచ్చింది.
![](https://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/11/10160951/F-dnUTgbMAAfDXY-755x1024.jpg)
అదే ఏడాదిలో వచ్చిన విజయ్ దేవరకొండతో చేసిన ‘గీతా గోవిందం’ సినిమా బ్లాక్బాస్టర్గా నిలవగా, దేవదాస్ మూవీ పర్వాలేదనిపించింది.
![](https://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/11/10160458/F-iZzJMa0AAH8do-819x1024.jpg)
ఆ తర్వాత వరుసగా మహేష్తో ‘సరిలేరు నీకెవ్వరు, నితీన్తో ‘బీష్మా’, కార్తీతో ‘సుల్తాన్’, బన్నీతో ‘పుష్ప’, శర్వానంద్తో ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’, సీతారామం, విజయ్తో ‘వారసుడు’ వంటి చిత్రాల్లో రష్మిక తళుక్కుమంది.
![](https://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/11/10160545/F-ekXlpawAEQQCF-768x1024.jpg)
హిందీలో అమితాబ్తో కలిసి ‘గుడ్ బై’, సిద్దార్థ్ మల్హోత్రాతో జంటగా ‘మిషన్ మజ్ను’ మూవీలో రష్మిక నటించింది.
![](https://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/11/10160638/F-dytGbaIAA0mLC-596x1024.jpg)
ప్రస్తుతం రష్మిక బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. పుష్ప 2తో పాటు, బాలీవుడ్ మూవీ యానిమల్ (Animal)లోనూ రష్మిక హీరోయిన్గా చేస్తోంది. స్టార్ హీరో రణ్బీర్కపూర్ (Ranbir Kapoor) టైటిల్ రోల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నాడు.
![](https://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/11/10160655/F-F6utybUAA411d-768x1024.jpg)
వీటితో పాటు రష్మిక ఫీ మేల్ సెంట్రిక్ కథాంశంతో సినిమా కూడా చేస్తోంది. ఈ సినిమాకు ‘రెయిన్ బో’ (Rainbow) టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ బైలింగ్యువల్ ప్రాజెక్ట్కు శాంతరూబన్ దర్శకత్వం వహిస్తున్నాడు. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్ ప్రభు, ఎస్.ఆర్ ప్రకాష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
![](https://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/11/10160815/F-ER_lEXoAAUHKP-631x1024.jpg)