• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వైకాపా బస్సు యాత్ర ప్రారంభం

    AP: వైకాపా సామాజిక సాధికార బస్సు యాత్రను ఇచ్ఛాపురంలో మంత్రి బొత్స సత్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. ‘ఈ యాత్రలో గత నాలుగేళ్లలో అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తాం. కేబినెట్‌లోనూ సామాజిక న్యాయం చేసిన నాయకుడు జగన్‌. వైకాపాకు ఓటు వేయని వారికి సంక్షేమ ఫలాలు అందించాం. విద్యారంగంలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టాం. నాడు-నేడుతో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. పేదల బతుకులు బాగుచేసిన ఘనత సీఎం జగన్‌దే’ అని వైసీపీ నేతలు అన్నారు.

    5 నుంచి భువనేశ్వరి బస్సు యాత్ర?

    చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా నారా భువనేశ్వరి బస్సు యాత్ర చేపట్టాలని యోచిస్తున్నారు. ఈనెల 5న కుప్పం నుంచి ప్రారంభించి రాయలసీమ జిల్లాల్లో కొనసాగించాలని ప్రణాళికలు వేస్తున్నారు. ఇన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్న భువనేశ్వరి.. టీడీపీ చేపడుతున్న అన్ని కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటున్నారు. కార్యకర్తల్లో ధైర్యం నింపుతూ ముందుకు సాగుతున్నారు. స్కిల్ స్కాం కేసులో కోర్టు తీర్పును అనుసరించి బస్సు యాత్రకు ప్లాన్ చేయనున్నట్లు తెలిసింది.