వచ్చే ఎన్నికల్లో మాదే అధికారం; టీపీసీసీ చీఫ్ రేవంత్
వచ్చే ఎన్నికల్లో తమదే అధికారమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ను తుంగలో తొక్కడానికే సమ్మక్క-సారక్క పోరాటగడ్డ నుంచి హాత్ సే హాత్ జోడో యాత్ర మొదలు పెట్టానన్నారు. బడ్జెట్ విలువ, కేసీఆర్ విలువ రెండూ గుండుసున్నా అని ఎద్దేవా చేశారు. తన సోదరి సీతక్క తిలకం దిద్ది రాచరిక పాలనను గద్దె దించాలని అడిగిందన్నారు. ఇది జరగాలంటే కేసీఆర్ను బొంద పెట్టాలని మండిపడ్డారు. కాగా రేవంత్ ములుగు నుంచి హాత్ సే హాత్ యాత్ర ప్రారంభించారు.