• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దగా, మోసాలకు మారు పేరు కాంగ్రెస్: హరీష్‌రావు

    కాంగ్రెస్ పార్టీపై మంత్రి హరీష్‌రావు తీవ్ర విమర్శలు చేశారు. దగా, మోసాలకు మారు పేరు కాంగ్రెస్ అని విమర్శించారు. ‘కాంగ్రెస్ గిరిజన తండాలు, గూడేలకు పలు హామీలు ఇచ్చి మోసం చేసింది. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పోడు భూములకు పట్టాలు ఇచ్చి వారిని ఆదుకున్నాం. రైతు బీమా మాదిరిగానే భూమిలేని పేదలకు రూ.5 లక్షల బీమా వర్తింప చేస్తాము. రైతులకు 3 గంటల కరెంట్ సరిపోతుందని కాంగ్రెస్ అంటుంది. 24 గంటల కరెంట్ కావాలనుకునే వాళ్లు బీఆర్‌ఎస్ పార్టీకి ఓటు వేయాలి’ అని … Read more

    కాంగ్రెస్‌కు కేటీఆర్‌ బహిరంగ సవాల్‌

    వృద్ధిరేటులో తెలంగాణ ఐదో స్థానంలో ఉందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేసినట్లు చెప్పారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారన్న ఆరోపణలు సరికాదన్నారు. ‘రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న భాజపా హామీ ఏమైంది?. కర్ణాటకను మోడల్‌గా కాంగ్రెస్‌ నేతలు చూపుతున్నారు. కర్ణాటక రైతులు రాష్ట్రానికి వచ్చి ఆందోళన చేస్తున్నారు. వారికి మేము డబ్బులు ఇచ్చి తీసుకొచ్చామని ఆరోపిస్తున్నారు. కర్ణాటకకు వెళ్లి రైతుల పరిస్థితి ఆరా తీద్దాం.. సిద్ధమా?’ అని కేటీఆర్‌ సవాలు విసిరారు. ⬆️ అటు రూరల్ డెవలప్‌మెంట్, ఇటు అర్బన్ … Read more

    45 మంది పేర్లతో కాంగ్రెస్ రెండో జాబితా

    తెలంగాణలో అంబ్లీ ఎన్నికల సంబంధించి కాంగ్రెస్ రెండో విడతా జాబితాను విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన జాబితాలో 45 మంది అభ్యర్థులను ప్రకటించింది. గద్దర్ కూతురికి సికింద్రాబాద్ కంటోన్నెంట్ సీటు ఖరారు చేసింది, ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరావు, పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కూకట్‌పల్లి నుంచి బండి రమేష్, హుస్నాబాద్ నుంచి పొన్నం సుధాకర్, జూబ్లీహిల్స్ నుంచి హజారుద్ధిన్‌ను భరిలో నిలవనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది.

    కాంగ్రెస్‌లోకి మోత్కుపల్లి

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. టీకాంగ్రెస్‌లోకి వలసలు పెరుగుతున్నాయి. తాజాగా మరికొందరు సీనియర్‌ రాజకీయ నేతలు హస్తం గూటికి చేరారు. నేడు జాతీయ కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, ఎమ్మెల్సీ ఆకుల లలిత, మాజీ ఎమ్మెల్సీలు నేతి విద్యాసాగర్‌, కపిలవాయి దిలీప్‌ కుమార్‌తో పార్టీలో చేరారు. వీరందరికీ ఖర్గే పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు.

    కాంగ్రెస్‌పై మోదీ వ్యంగ్యాస్త్రాలు

    ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఏడో ఎడిషన్‌ను మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కాలం చెల్లిన ఫోన్లు పని చేయవు వాటిని ఎన్ని సార్లు స్విచ్‌ఆన్ చేసినా బటన్లు నొక్కిన ఫలితం ఉండదు. కాంగ్రెస్‌ది కూడా ఇప్పడు అలాంటి పరిస్థితే. 2014లో కాలం చెల్లిన ఫోన్లను వదిలించుకున్నట్లు కాంగ్రెస్‌ను వదిలించుకున్నారు. ఈ దేశానికి సాయం చేసే గొప్ప అవకాశాన్ని మాకు కల్పించారు’ అని మోదీ చెప్పుకొచ్చారు.

    బీజేపీ రెండో జాబితా విడుదల

    తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ రెండో జాబితాను విడుదల చేసింది. అయితే ఈ జాబితాలో ఒకే ఒక్క అభ్యర్థి పేరు ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మహబూబ్‌నగర్ అసెంబ్లీకి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కుమారుడు మిథున్ కుమార్ రెడ్డి పేరును ఖరారు చేసింది. త్వరలోనే పూర్తిస్థాయి జాబితాను విడుదల చేసేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. అయితే ప్లాన్ ప్రకారమే బీజేపీ రెండో జాబితాలో ఒక్క అభ్యర్థి పేరు మాత్రమే ప్రకటించిందని టాక్ నడుస్తోంది.

    అభివృద్దిని చూసి ఓటేయండి: కేటీఆర్

    సిరిసిల్ల నియోజవర్గంలో అభివృద్దిని చూసి ఓటేయాలని మంత్రి కేటీఆర్ అన్నారు. ‘తెలంగాణ ఏర్పడక ముందు సిరిసిల్ల ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి. కొందరు సోషల్ మీడియాలో నియోజవర్గ అభివృద్దిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఒక్కసారి ఇక్కడ జరిగిన అభివృద్ధి సోషల్ మీడియాల్లో చూపించి వారికి ప్రజలే బుద్ది చెప్పాలి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు, కేజీ టూ పీజీ క్యాంపస్‌లు వచ్చాయి.. సిరిసిల్ల అభిృద్ధిని చూసి ప్రతిపక్షాలు అసూయపడుతున్నాయి’. అని కేటీఆర్ పేర్కొన్నారు.

    తెలంగాణ కాంగ్రెస్‌లో భారీ చేరికలు

    తెలంగాణ కాంగ్రెస్‌లో భారీ చేరికలు చోటుచేసుకున్నాయి. మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు సంతోష్‌ కుమార్, నేతి విద్యాసాగర్, ఆకుల లలిత, కపిలవాయి దిలీప్ కుమార్, మోత్కుపల్లి నర్సింహులు, నీలం మధు ముదిరాజ్ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఢిల్లీలో కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. పటాన్‌చెరు నుంచి భారాస తరపున టికెట్‌ ఆశించిన నీలం మధు.. అది దక్కకపోవడంతో కాంగ్రెస్‌లో చేరారు.

    ‘భాజపాకు ఓటేస్తే భారాసకు వేసినట్లే’

    TG: భాజపాకు రాజీనామా చేయడంపై కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కేసీఆర్ అవినీతిపై బీజేపీ చర్యలు తీసుకుంటుందనే ఆ పార్టీలో చేరా. చర్యలు లేనందునే బయటకు వచ్చా. బీజేపీలో నాకు గౌరవం, ప్రాధాన్యత ఇచ్చారు. కానీ నా లక్ష్యం నెరవేరలేదు. హాంగ్ వస్తే బీజేపీ, ఎంఐఎం ఎమ్మెల్యేలు భారాసకు మద్దతు ఇస్తారు. బీజేపీకి ఓటు వేస్తే బీఆర్ఎస్‌కి ఓటు వేసినట్లే. ప్రజలు నేను కాంగ్రెస్‌లో రావాలని కోరుకుంటున్నారు’ అని రాజగోపాల్‌రెడ్డి అన్నారు.

    ప్రతిపక్షాలకు సీఎం కేసీఆర్ చురకలు

    ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రతిపక్షాలకు చురకలంటించారు. తెలంగాణ కోసం పోరాడుతున్నప్పుడు కొందరు నేతలు ఎవరి కాళ్లదగ్గర ఉన్నారని విమర్శించారు. ‘పాలమూరు ప్రజలు బొంబయికి వలస పోయినప్పుడు కాంగ్రెస్ ఏం చేస్తుంది. తెలంగాణ కోసం 24 ఏళ్ల క్రితం ఒంటరిగా ప్రయాణం ప్రారంభించా. ఇంటింటికీ నల్లా నీరు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. కొడంగల్‌ రా.. గాంధీ బొమ్మ దగ్గరకు రా.. అని కొందరు నాకు సవాలు విసురుతున్నారు. కేసీఆర్‌ దమ్ము ఏంటో దేశమంతా చూసింది. కొత్తగా చూపాల్సిన అవసరం లేదు’. అని … Read more