• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రూ.50 కోట్లు విలువైన డ్రగ్స్‌ సీజ్‌

    HYD: రాజీవ్‌గాంధీ ఎయిర్‌పోర్టులో భారీ డ్రగ్‌ రాకెట్‌ గుట్టురట్టయింది. విమానాశ్రయంలో నిర్వహించిన తనిఖీల్లో 5 కిలోల కొకైన్‌ లభ్యమైంది. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ రూ.50 కోట్లు. ఓ సూట్‌కేస్‌తోపాటు మహిళలు వినియోగించే నాలుగు హ్యాండ్‌బ్యాగ్‌ల అడుగు భాగంలో ఈ సరకును పొడిరూపంలో దాచారు. లావోస్‌ నుంచి సింగపూర్‌ మీదుగా హైదరాబాద్‌కు వచ్చిన ఓ ప్రయాణికుడు డ్రగ్స్‌ తీసుకొచ్చాడు. హైదరాబాద్‌కు వచ్చిన అనంతరం తిరిగి దిల్లీకి వెళ్లే ప్రయత్నంలో ఉన్న నిందితుడ్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. Sleuths of DRI seized 5 … Read more

    డ్రగ్స్ కేసులో హీరోయిన్‌కు నోటీసులు

    స్టార్ హీరోయిన్ వరలక్ష్మీ శరత్‌కుమార్‌కు కొచ్చి NIA అధికారులు నోటీసులు పంపారు. వరలక్ష్మీ పీఏ ఆదిలింగం డ్రగ్స్ కేసులో కీలక నిందితుడిగా ఉన్నాడు. అతడికి అంతర్జాతీయ డ్రగ్స్ డీలర్లతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. వరలక్ష్మీకి కూడా ఆదిలింగం చాలాసార్లు డ్రగ్స్ అందించినట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా డ్రగ్స్ అమ్మిన డబ్బులతో సినిమాల్లో పెట్టుబడులు కూడా పెట్టినట్లు తేల్చారు. దీంతో ఆమెను విచారించేందుకు NIA అధికారులు విచారణకు పిలిచారు.

    డ్రగ్స్ కేసులో ఆషూరెడ్డి!

    బిగ్‌బాస్ ఫేమ్, హీరోయిన్ ఆషూరెడ్డి పేరు డ్రగ్స్ కేసులో వినిపిస్తోంది. ఇటీవలే నిర్మాత కేపీ చౌదరి సెలబ్రిటీలకుడ్రగ్స్ సరఫరా చేస్తూ పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడిని పోలీసులు విచారించగా 12 మందికి డ్రగ్స్ సరఫరా చేసినట్లు ఒప్పుకున్నాడు. సెలబ్రిటీలు, నేతల కుమారులకు డ్రగ్స్ అమ్మినట్లు అంగీకరించాడు. ఆషూరెడ్డి, సుశాంత్ రెడ్డి, నితినేశ్, రఘతేజ, భరత్ బెజవాడ, శ్వేత, ఠాగోర్ ప్రసాద్, సనా మిశ్రాల పేర్లు ఈ జాబితా ఉన్నట్లు తెలుస్తోంది.