• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆకలితో అలమటిస్తున్న యువతి

    మాస్టర్స్ చేసేందుకు అమెరికా వెళ్లిన హైదరాబాద్ యువతి అక్కడ రోడ్లపై ఆకలితో అలమటిస్తోంది. విషయం తెలుసుకున్న ఆమె తల్లి భారత్‌కు తీసుకురావాలని కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్‌కు లేఖ రాసింది. మిన్హాజ్ జైదీ మాస్టర్స్ చేసేందుకు 2021లో అమెరికా వెళ్లింది. వస్తువులు ఎవరో దొంగిలించడంతో ఆమె చికాగో రోడ్లపై ఆకలి కడుపుతో తిరుగుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్లిన కొందరు జైదీని గుర్తించి తల్లికి సమాచారం అందించారు. దీంతో తన కుమార్తెను భారత్‌కు రప్పించేందుకు ఆమె తల్లి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. Syeda … Read more

    చైనాతో ముప్పు తొలగిపోలేదు: జైశంకర్‌

    చైనా-భారత్‌ మధ్య నెలకొన్న ప్రతిష్టంభన ఇంకా తొలగిపోలేదని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. ‘నా దృష్టిలో చైనాతో పరిస్థితి ఇప్పటికి ముప్పుగానే ఉంది. కారణం సరిహద్దుల్లో మోహరింపులు చాలా దగ్గరగా ఉన్నాయి. సైనిక అంచనాల ప్రకారం ఇంకా కొన్ని ప్రదేశాల వద్ద పరిస్థితి ‍ప్రమాదకరంగానే ఉంది. అందువల్ల ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధం అసాధారణ సవాళ్లను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతోంది’ అని అన్నారు

    పాక్‌ జర్నలిస్ట్‌కు దిమ్మదిరిగే జవాబిచ్చిన జై శంకర్‌

    న్యూయార్క్‌లోని యూఎన్‌ ప్రధాన కార్యాలయం వద్ద ఓ మీడియా సమావేశంలో… తీవ్రవాదంపై పాకిస్తాన్‌ జర్నలిస్ట్‌ అడిగిన ఓ ప్రశ్నకు భారత విదేశాంగ మంత్రి దిమ్మదిరిగే సమాధానమిచ్చారు. ‘ఇంకెంత కాలం దిల్లీ, కాబూల్‌, పాకిస్థాన్‌ నుంచి దక్షిణ ఆసియా తీవ్రవాదాన్ని ఎదుర్కొంటుంది. ఇంకెంత కాలం యుద్ధపు అంచున నిలబడాలి?’ అని పాక్‌ రిపోర్టర్‌ ప్రశ్నించారు. ‘ ఈ ప్రశ్న నన్ను కాదు. పాక్‌ ఎంతకాలం ఉగ్రవాదాన్ని ఆచరించాలనుకుంటుందో మీ మంత్రిని అడిగితే చెబుతారు’ అంటూ జై శంకర్‌ సమాధానమిచ్చారు.