• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బాకీ డబ్బులు అడుగుతున్నాడని చంపేశాడు..

    AP: తీసుకున్న అప్పును తిరిగి అడిగినందుకు యువకుడిని ఓ వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. వైఎస్‌ఆర్‌ జిల్లాకు చెందిన సాయికిరణ్‌ కొంతకాలం సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేసి మానేశాడు. ఈ క్రమంలో అతడికి పరిచయమైన మహేంద్ర అనే వ్యక్తికి సాయి రూ.50 వేలు అప్పుగా ఇచ్చారు. అప్పుతీర్చమని మహేంద్రను, సాయి ఒత్తిడి చేయడందో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన మహేంద్ర తన వద్ద ఉన్న కత్తితో సాయికిరణ్‌ కడుపులో పొడవడంతో అతడు మృతి … Read more

    టీచర్‌తో ప్రేమ.. పదో తరగతి విద్యార్థి హత్య

    ఓ టీచర్‌ వద్ద ట్యూషన్ చదువుకుంటున్న పదోతరగతి విద్యార్థిని ఆమె ప్రియుడు హత్య చేశాడు. విద్యార్థిని కిడ్నాన్ చేసిన హత్యచేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. రచిత అనే 21 ఏళ్ల యువతి కాన్పూర్‌లో ట్యూషన్‌ నడుపుతోంది. అక్కడ 17 ఏళ్ల విద్యార్థి చదువుకోవడానికి ఆమె దగ్గరకి వెళ్తుంటాడు. వీళ్లిద్దరి మధ్య ప్రేమ ఉందన్న అనుమానించిన ఆమె ప్రియుడు ప్రభాత్‌ శుక్లా.. బాలుడ్నికిడ్పాప్ చేసి హత్యచేశాడు. ప్రేమ వ్యవహారమే కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

    పెంపుడు కుమార్తే తల్లికి యమపాశమైంది

    ఏపీ విశాఖ: అల్లారు ముద్దగా పెంచుకున్న పెంపుడు కూతుర్తే ఆ తల్లికి యమపాశమైంది. ప్రభుత్వ ఉద్యోగులైన దంపతులకు సంతానం లేకపోవడంతో నిబంధనల ప్రకారం ఓ బాలికను దత్తత తీసుకున్నారు. సదరు బాలికకు 13 ఏళ్లు వచ్చే సరికే చెడు వ్యాసనాలకు బానిసైంది. 19 ఏళ్ల యువకుడితో ప్రేమయాణం సాగించింది. దీంతో ఆమెను పెంపుడు తల్లి మందలించేది. ఈ క్రమంలో కోపం పెంచుకున్న ఆ బాలిక ప్రియుడి సాయంతో తల్లిని అంతమొందించింది. కుటుంబసభ్యులకు అనుమానం రావడంతో పోలీసులను ఆశ్రయించారు. దీంతో అసలు విషయం తెలుగు చూసింది.

    తమ్ముడిని నరికి చంపిన అన్న

    హైదరాబాద్‌ ఫిలింనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. భార్యను వేధిస్తున్నాడన్న అనుమానంతో అన్న తమ్ముడిని హతమార్చాడు. అనంతరం నిందితుడు పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. షబ్బీర్‌ అహ్మద్‌ తన భార్యను తమ్ముడు సాజిద్‌ వేధిస్తున్నాడని అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో తమ్ముడిని దారుణంగా నరికి చంపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. హత్యకు గల కారణాలను సేకరించి దర్యాప్తు చేపట్టారు. సాజిద్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

    భార్యను చంపి..భర్త ఆత్మహత్య

    HYD: రంగారెడ్డి జిల్లా అనాజ్‌పూర్‌ గ్రామంలో దారుణం జరిగింది. భార్య, కుమారుడిని చంపిన మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. 6 నెలల కిందట భార్య లావణ్యపై గొడ్డలితో దాడి చేసి భర్త ధన్‌రాజ్ హతమార్చాడు. తర్వాత 3నెలల పసికందును చంపేశాడు. ఈ కేసులో ధన్‌రాజ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల బెయిప్‌పై ధన్‌రాజ్ విడుదలైయ్యాడు. ఈ క్రమంలో భార్య, బిడ్డను చంపానని మనస్తాపానికి గురైన ధన్‌రాజ్‌ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.