• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘గెలుపు సాధించే వరకూ పోరాడదాం’

    AP: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ భార్య బ్రాహ్మణి ట్విటర్‌ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయం సాధించేవరకూ పోరడాటమే దసరా స్ఫూర్తి అని ఆమె స్పష్టం చేశారు. ‘మహిషాసురుడి అంతానికి దుర్గాదేవి 9 రాత్రులు యుద్ధం చేసింది. కలియుగ అసురులను అంతమొందించేవరకు పోరాడదాం’ అని బ్రాహ్మణి పిలుపునిచ్చారు. ఈ ట్వీట్‌కు ‘దేశం చేస్తోంది రావణ దహనం.. మనం చేద్దాం జగనాసుర దహనం’ పోస్టర్‌ను ఆమె జత చేశారు. తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో బ్రాహ్మణి ఈ వ్యాఖ్యలు చేశారు.

    కశ్మీర్ లోయల్లో నారా బ్రాహ్మణి బైక్ రైడ్

    టీడీపీ అధినేత చంద్రబాబు కోడలు, నందమూరి బాలక్రిష్ణ కుమార్తె నారా బ్రాహ్మణి కశ్మీర్‌లో సాహస యాత్రలు చేస్తోంది. లడ్డాక్‌లోని పర్వతాలపై తన ‘జావా ఎజ్ది’ బైక్‌పై రైడింగ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె నడిపై బైక్ అధిక బరువు ఉన్నా సునాయాసంగా నడుపుతోంది. ఆమె బైక్ కలర్ కూడా పసుపు రంగులోనే ఉండటం విశేషం. కాగా బ్రాహ్మణి హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, మరోవైపు తన భర్త నారా లోకేశ్‌కు రాజకీయంగా అండగా ఉంటోంది.