• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆసక్తికరంగా ‘అహింస’ ట్రైలర్

    టాలీవుడ్ నటుడు దగ్గుబాటి రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ హీరోగా ‘అహింస’ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా ట్రైలర్‌ను గురువారం మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్‌ను బట్టి చూస్తే పల్లెటూరి నేపథ్యంలో రూపొందించినట్లు తెలుస్తోంది. ట్రైలర్‌లోని సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీలో అభిరామ్ సరసన గీతికా తివారి నటిస్తోంది. సదా కీలక పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ తేజ తెరకెక్కిస్తున్నారు. ఆర్పీ పట్నాయక్ సంగీతం అందిస్తున్నారు.

    యాక్షన్‌తో కుమ్మేసిన ‘పఠాన్’

    బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ హీరోగా, హాట్ హీరోయిన్ దీపికా పడుకొణె హీరోయిన్‌గా తెరకెక్కిన ‘పఠాన్’ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ట్రైలర్ చూస్తుంటే హాలీవుడ్ మూవీ చూసినట్లుగా ఉందనిపిస్తోంది.ఈ మూవీ హైఓల్టేజ్ యాక్షన్ చిత్రంగా రూపొందించినట్లు తెలుస్తోంది. షారుఖ్, దీపికా ఇద్దరూ దేశం కోసం పని చేసే సైనికులుగా నటించారు. విలన్ పాత్రలో జాన్ అబ్రహాం నటించాడు. ఈ మూవీని సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించారు. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

    ‘శాకుంతలం’ ట్రైలర్ రిలీజ్; దుమ్ములేపిన సామ్

    స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన దృశ్యకావ్యం ‘శాకుంతలం’ ట్రైలర్‌ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. ట్రైలర్‌ను బట్టి చూస్తే ఈ సినిమాలో సమంత అద్భుతంగా నటించినట్లు తెలుస్తోంది. మూవీ విజువల్స్ కళ్లు చెదిరే రీతిలో ఉన్నాయి. శకుంతల పాత్రలో సమంత.. దుష్యంతుడి పాత్రలో దేవ్ మోహన్ నటించారు. ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహించారు. మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

    సూపర్.. ట్రైలర్ అదిరింది

    బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ ట్రైలర్ విడుదలైంది. ‘తనది ఫ్యాక్షన్ కాదు.. సీమపై ఎఫెక్షన్’ వంటి మాస్ డైలాగులతో ట్రైలర్ హోరెత్తిపోతోంది. ఒక్క ట్రైలర్‌లో ఎన్నో డైలాగులను ఇమిడ్చి సినిమాపై అంచనాలు పెంచేశారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. శ్రుతిహాసన్ కథానాయికగా నటించగా.. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటించింది.

    ఆసక్తి రేపుతున్న ‘18 పేజీస్’ ట్రైలర్

    నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా తెరకెక్కిన ‘18 పేజీస్’ చిత్రం ట్రైలర్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ప్రేక్షకులకు ఆసక్తి రేపుతూ.. కొత్త అనుభూతిని అందిస్తోంది. ఇప్పటికే ఈ మూవీలోని పాటలు రిలీజై శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి. కాగా ఈ చిత్రానికి పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించారు. క్రిస్‌మస్ కానుకగా డిసెంబర్ 23న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

    ‘స్పైడర్‌మ్యాన్’ ట్రైలర్ వచ్చేసింది

    ప్రపంచవ్యాప్తంగా స్పైడర్‌మ్యాన్ చిత్రాలకు ఎనలేని క్రేజ్ ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ‘స్పైడర్‌మ్యాన్’- అక్రాస్ దస్పైడర్ వెర్స్ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం ‘స్పైడర్‌మ్యాన్’ మూవీ ట్రైలర్ లాంఛ్ అయింది. అభిమానులను ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి ముగ్గురు డైరెక్టర్లు దర్శకత్వం వహించడం విశేషం. షామీక్ మూర్, హైలీ స్టైన్‌ఫెల్డ్, ఆస్కార్ ఇసాక్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీని వచ్చే ఏడాది జూన్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు.

    ఇంట్రెస్టింగ్‌గా ‘కనెక్ట్’ ట్రైలర్

    లేడీ సూపర్‌స్టార్ నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘కనెక్ట్’ మూవీట్రైలర్ విడుదల అయ్యింది. ట్రైలర్ మొదటి నుంచి చివరి వరకూ భయంభయంగా సాగింది. పూర్తిగా హార్రర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు ఇంటర్వెల్ లేకపోవడం విశేషం. ఈ మూవీని అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించారు. సత్యరాజ్, అనుపమ్ ఖేర్, నాఫియా తదితరులు కీలక పాత్రలు పోషించారు.డిసెంబర్ 22న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.

    థ్రిల్లింగ్‌గా ‘ముఖచిత్రం’ ట్రైలర్

    యంగ్ డైరెక్టర్ సందీప్ రాజ్ తెరకెక్కించిన ‘ముఖచిత్రం’ ట్రైలర్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ఇది లవ్ స్టోరీయో.. లేదా థ్రిల్లరో కాదు.. స్పోర్ట్స్ డ్రామా అంటూ సాగే డైలాగ్ థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. ఈ సినిమాలో మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. మూవీలో వికాస్ వశిష్ఠ, ప్రియా వడ్లమాని, చైతన్యరావ్‌లు హీరో హీరోయిన్లుగా నటించారు. పాకెట్ మంకీ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను తెరకెక్కించింది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 9న థియేటర్లలో విడుదల చేస్తున్నారు.

    ఆకట్టుకుంటున్న ‘పంచతంత్రం’ ట్రైలర్

    బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘పంచతంత్రం’. ఐదు విభిన్న స్టోరీల సమాహారంతో రూపుదిద్దుకున్న ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. హర్ష పులిపాక దర్శకత్వం వహించారు. ప్రేమ, అనుబంధాల కలబోతతో ముడిపడిన జీవితాలను ప్రస్ఫుటం చేసేలా ఉన్న ఈ ట్రైలర్ వీక్షకులను ఆకట్టుకుంటోంది. శ్రావణ్ భరద్వాజ్, ప్రశాంత్ విహారీ ఈ చిత్రానికి సంగీత దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. కాగా, ఈ చిత్రం డిసెంబరు 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. టికెట్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందింది.

    ఆకట్టుకుంటున్న ‘క్రేజీ ఫెలో’ ట్రైలర్

    టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ హీరోగా నటించిన ‘క్రేజీ ఫెలో’ సినిమా ట్రైలర్‌ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ చూస్తే ఈసారి ఆది ఖచ్చితంగా హిట్ కొట్టేలా కనిపిస్తోంది. కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌ట్రైనర్‌గా ఈ చిత్రాన్నిరూపొందించినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ ఫణిక్రిష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో ఆదికి జోడీగా సూర్యవంశీ, మర్నామీనన్‌లు నటించారు. కాగా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 14న విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.