ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్ టికెట్ దందా
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వద్ద బ్లాక్ టికెట్ దందా జరుగుతోంది. ఆన్లైన్లో టికెట్లు కొన్న యువకులు స్టేడియం బయట బ్లాక్లో విక్రయిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు 15 మందిని అరెస్ట్ చేసి టికెట్లు స్వాధీనం చేసుకున్నారు. గతంలోనూ ఉప్పల్లో మ్యాచ్ టికెట్ల విషయంలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. తాజాగా మళ్లీ బ్లాక్ దందా బయటపడింది. రేపు ఇండియా, న్యూజిలాండ్ మధ్య ఉప్పల్లో తొలి వన్డే జరగబోతోంది.