ప్రతిక్షణం మెరుగయ్యేందుకే యత్నిస్తా: కోహ్లీ
ప్రతిక్షణం మరింత మెరుగయ్యేందుకు ప్రయత్నిస్తుంటానని భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అన్నాడు. అందుకోసం నిరంతరం శ్రమిస్తుంటానని తెలిపాడు. ‘ప్రదర్శన మాత్రమే లక్ష్యమైతే కొంతకాలం తర్వాత సంతృప్తి చెందొచ్చు. ఆటపై పనిచేయడం మానేయొచ్చు. కానీ నేను ఎప్పుడూ నైపుణ్యం మెరుగుపరుచుకోడానికే ప్రయత్నిస్తుంటా. దానికి హద్దు లేదన్నది నా నమ్మకం. కాబట్టే సుదీర్ఘ కాలం ఆడుతూ ఉత్తమ ప్రదర్శనలు ఇవ్వగలుగుతున్నా’ అని కోహ్లి పేర్కొన్నాడు. కాగా, ప్రస్తుత వరల్డ్కప్లో కోహ్లీ 118 సగటుతో 354 పరుగులు చేశాడు.