• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • విశాల్ ఆరోపణలు.. రంగంలోకి CBI

    ఇటీవల సెన్సార్ బోర్డు అవినీతిపై హీరో విశాల్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో విశాల్ ఆరోపణలపై సీబీఐ విచారణ మొదలు పెట్టింది. ఇప్పటికే ముగ్గురు వ్యక్తులపై దర్యాప్తు సంస్థ కేసులు నమోదు చేసింది. తాజాగా ముంబాయిలో నాలుగు చోట్ల సోదాలు చేసింది. ఓ హిందీ రీమేక్ సినిమాకు సెన్సార్ బోర్టు అధికారులలో ఇద్దరు నిందితులతో కలిసి నిందితురాలు రూ.6.54 లక్షలు తీసుకున్నట్లు సీబీఐ గుర్తించింది. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.

    సెన్సార్ బోర్డుపై సీబీఐ కేసు నమోదు

    ముంబై సెన్సార్‌ బోర్డుపై సీబీఐ కేసు నమోదు చేసింది. హీరో విశాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసులు పెట్టింది. మార్క్ ఆంటోని చిత్రం సెన్సార్ కోసం రూ.7 లక్షలు లంచం ఇవ్వాల్సి వచ్చిందని ఇటీవల విశాల్ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై సెన్సార్ బోర్డు కూడా స్పందించింది. వెంటనే చర్యలకు ఉపక్రమించిన సెన్సార్ బోర్డు.. ఇకపై సినిమా నిర్మాణ సంస్థలు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. అయితే సెన్సార్ బోర్డు తీరుపట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి.