• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 25 నుంచి ‘నిజం గెలవాలి’ యాత్ర

    AP: చంద్రబాబు అక్రమ అరెస్టు నేపథ్యంలో చనిపోయిన తెదేపా కార్యకర్తలు, అభిమానుల కుటుంబాలను ఈ నెల 25 నుంచి భువనేశ్వరి పరామర్శించనున్నారు. ‘నిజం గెలవాలి’ యాత్ర ద్వారా వారానికి 3 రోజుల పాటు ఇంటింటికి వెళ్లి పరామర్శిస్తారు. స్థానికంగా జరిగే సభలు, సమావేశాల్లోనూ పాల్గొంటారు. మొదట రాయలసీమ జిల్లాల్లో ఈ పర్యటన సాగనుంది. 24న భువనేశ్వరి తిరుమల శ్రీవారిని దర్శించుకుని, అదేరోజు నారావారిపల్లెకు వెళ్తారు. 25న చంద్రగిరిలో యాత్ర ప్రారంభిస్తారు.

    ‘అభివృద్ధి చేసినందుకా చంద్రబాబు అరెస్టు’

    చంద్రబాబు తప్పు చేయకుండానే అక్రమ కేసులో జైల్లో పెట్టారని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీని అభివృద్ధి చేసినందుకా చంద్రబాబు అరెస్టు? అని ప్రశ్నించారు. ప్రజలు ఆనందంగా ఉండాలి, ఉన్నతంగా జీవించాలని తపించినందుకా అని నిలదీశారు. అదే నేరమైతే ఇక ప్రజలకు దిక్కెవరని భువనేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు.

    ప్రజాధనంపై మాకు ఆశలేదు: భువనేశ్వరి

    AP: తన తండ్రి, భర్త ఇద్దరూ సీఎంలుగా చేసినా తమ కుటుంబం ఎప్పుడూ ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి పాల్పడలేదని చంద్రబాబు భార్య భువనేశ్వరి అన్నారు. రాష్ట్రం, ప్రజల బాగు కోసమే చంద్రబాబు నిత్యం పరితపించేవారన్నారు. స్వాతంత్రం కోసం పోరాటం చేసిన గాంధీజీనే జైలులో పెట్టారని ఆమె గుర్తుచేశారు. తన ఆయుష్షు కూడా పోసుకొని చంద్రబాబు జీవించాలని ప్రార్థించారు. ప్రజాధనంపై తమకు ఎప్పూడు ఆశలేదని, మా కుటుంబ సభ్యులపై ఒక్క కేసు కూడా లేదని భువనేశ్వరి పునరుద్ఘటించారు. నా ఆయుషు కూడా పోసుకుని ఆయన బ్రతకాలి … Read more