• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాలి: రాహుల్

    కొల్లాపూర్‌లో సభలో బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ప్రజా తెలంగాణ.. దొరల తెలంగాణ మధ్య ఈ ఎన్నికలు జరగనున్నాయన్నారు. ‘ఆరు గ్యారెంటీలు అమలు కావాలంటే తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాలి. కాంగ్రెస్‌ వస్తే రైతుబంధు నిలిచిపోతుదంటున్నారు. అందులో వాస్తవం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు భరోసా రూ.15వేలు అందిస్తాం. ఉపాధి హామీ కూలీలకు రూ.12వేలు ఇచ్చి ఆదుకుంటాం’ అని రాహుల్ హామీ ఇచ్చారు.

    రాహుల్ షేర్ కాదు పేపర్ పులి: కవిత

    కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఎమ్మెల్సీ కవిత ఫైరయ్యారు. రాహుల్ బబ్బర్ షేర్ కాదని.. పేపర్ పులి మాత్రమే అని విమర్శించారు. జగిత్యాలలో కవిత మాట్లాడుతూ.. ‘గాంధీ కుటుంబానికి తెలంగాణకు విద్రోహక సంబంధం ఉంది. సీఎం కేసీఆర్ నిరాహార దీక్ష చేసి పోరాడితే తెలంగాణ వచ్చింది. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే సింగరేణి కార్మికులకు న్యాయం జరిగింది. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వయసు మరచి దిగజారి మాట్లాడుతున్నారు. గల్ఫోలో ఉన్న వారి పేర్లు రేషన్ కార్డుల నుంచి ఎట్టి పరిస్థితిలోను తొలగించం’ అని కవిత … Read more

    ఆ మూడు పార్టీలు ఒక్కటే: రాహుల్

    తెలంగాణలో బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం ఒకటేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. నిజామాబాద్‌ జిల్లా మీటింగ్‌లో రాహుల్‌ మాట్లాడారు.. ‘రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం ఒకటే, కేంద్రం బీఆర్‌ఎస్‌‌కు మద్దతు పలుకుతుంది. బీజేపీ నాపై 24 కేసులు పెట్టింది. మరి అదే బీజేపీ కేసీఆర్‌ మీద ఎన్ని కేసులు పెట్టిందో చెప్పాలి. కేసీఆర్‌ మీద సీబీఐ, ఈడీ, ఐటీ కేసులు, చర్యలు ఉండవు దేశంలోనే అవినీతి సీఎం కేసీఆర్’ అని రాహుల్ ఆరోపించారు.

    ‘రాహుల్ గాంధీకి సొంత ఇల్లు కూడా లేదు’

    టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోసారి సీఎం కేసీఆర్‌పై ఫైరయ్యారు. కేసీఆర్ మాయమాటలతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాడని ఆరోపించారు. ‘తెలంగాణలో నాగార్జున సాగర్, శ్రీరామ్‌సాగర్, నెట్టెంపాడు వంటి భారీ ప్రాజెక్టులను కాంగ్రెస్ నిర్మించింది. హైదరాబాద్‌కు ఐటీ ప్రాజెక్టులు, విమానాశ్రయం, మెట్రో రైలు మంజూరు చేసింది. నెహ్రూ స్వాతంత్ర్యం కోసం పోరాడి జైలుకు వెళ్లారు. ఇందిరా గాంధీ దేశం కోసం ప్రాణ త్యాగం చేశారు. ఇన్నేళ్లు ఎంపీ పదవుల్లో ఉన్నప్పటికీ రాహుల్ గాంధీకి సొంత ఇల్లు లేదు’. అని రేవంత్ తెలిపారు.

    తెలంగాణ గురించి చెబుతూ రాహుల్ ఎమోషనల్

    తెలంగాణ గురించి మాట్లాడుతూ కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ఎమోషనల్ అయ్యారు. ‘తెలంగాణతో మాకు ఉన్నది రాజకీయ సంబంధం కాదు.. కుటుంబ సంబంధం ఉంది. తెలంగాణతో మోదీ, కేసీఆర్‌లకు కేవలం రాజకీయ సంబంధమే ఉంది. మీరంతా ఒక్కసారి గుర్తు పెట్టుకోండి. మీకు మాకు మధ్య ఉంది రాజకీయ సంబంధం కాదు. మీ అభిమానం.. ఆశీర్వాదంతో కూడిన సంబంధం. అందుకే మా చెల్లె ప్రియాంకను తీసుకు వచ్చా. తెలంగాణతో మనకు రాజకీయ సంబంధం కాదు.. కుటుంబ సంబంధం అని చెప్పి తీసుకు వచ్చా’ అని చెప్పుకొచ్చారు.

    కాంగ్రెస్ 6 క్యారెంటీ కార్టులకు పూజలు

    నేడు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణలో పర్యటించారు. ముందుగా పాలంపేటలోని పార్టీ సీనియర్ నేతలతో కలిసి రామప్ప ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీ కార్టులను రామప్ప స్వామి చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ విజయభేరి యాత్రలో రాహుల్, ప్రియాంక పాల్గొన్నారు.