• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఏపీలో టీడీపీ అల్లకల్లోలం సృష్టిస్తోంది: కారుమూరి

    ఏపీలో అల్లకల్లోలం సృష్టించాలని టీడీపీ కుట్రలు పన్నుతోందని వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు ఆరోపించారు. ‘ప్రజలు చంద్రబాబు గురించి ఆలోచించడం లేదు. చంద్రబాబు ప్రజల దగ్గరకు యాక్టర్లను పంపిస్తుంటే.. జగన్ డాక్టర్లను పంపిస్తున్నారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు చెప్పుకోవటానికి ఒక్క పథకం కూడా లేదు. చంద్రబాబు ఇన్నేళ్ళు స్టేల మీదే బతికాడు. శిశుపాలుడిలా చంద్రబాబు పాపం పండింది అంటూ విమర్శలు గుప్పించారు.

    వీడియోలు ఉంటే చూపించు… కన్నీళ్లు పెట్టుకున్న రోజా

    బ్లూఫిల్మ్స్‌లో నటించిందంటూ తనపై అసభ్య వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత బండారు సత్యనారాయణపై మంత్రి రోజా విరుచుకుపడ్డారు. “సత్యానారాయణ చెప్పినట్లుగా వీడియోలు ఉంటే బయట పెట్టాలి. టీడీపీ కోసం 10 ఏళ్లు కష్టపడ్డా. అక్కడ అవమానాలు ఎదుర్కోలేకే వైసీపీలో చేరా. జగన్, విజయమ్మలు కన్నకూతురిలా ఆదరించారు. బ్లాక్ మెయిల్ చేస్తూ తన క్యారెక్టర్‌ను కించపరుస్తున్నారని కన్నీళ్లు పెట్టుకున్నారు”. మరోవైపు సత్యనారాయణ వ్యాఖ్యలపై పెద్దఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. https://x.com/SumaTiyyaguraa/status/1709191945334174132?s=20

    టీడీపీ-జనసేనదే అధికారం: పవన్

    వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. ఎన్నికల్లో సీఎం జగన్‌ ఓటమి ఖాయమని జోష్యం చెప్పారు. ‘ డీఎస్‌సీ కోరుకుంటున్న నిరుద్యోగులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. 30 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ‘యువత భవిష్యత్తు బాగుండాలని ఎప్పుడూ అనుకుంటా. ఈసారి ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధమని జగన్‌ అంటున్నారు. టీడీపీ-జనసేన అధికారంలోకి రావడం ఖాయం’’ అని పవన్‌ ధీమా వ్యక్తం చేశారు.