టీడీపీ, జనసేన పొత్తు ఉంటుందా?
AP: రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్య పరిణామం చోటు చేసుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. జనసేన, టీడీపీ పొత్తుపై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. చంద్రబాబును పవన్ కళ్యాణ్ కలిసిన అనంతరం జనసనే రాజకీయ వ్యవహారాల కమిటీ తొలిసారిగా భేటీ అయింది. దీంతో పార్టీల పొత్తుపై ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతోంది. ప్రతిపక్షాలతో కలిసి ప్రజా సమస్యలపై పోరాడతామని, ప్రభుత్వ పాలనను ఎండగడతామని జనసేనాని పవన్ కళ్యాణ్ ఇదివరకే చెప్పడం గమనార్హం.