• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దేశంలోకి 70 మంది ఉగ్రవాదులు!

    నకిలీ పాస్‌పోర్టులతో దేశంలోకి అక్రమంగా ఉగ్రవాదులు ప్రవేశించినట్లు కేంద్ర నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి. సుమారు 70 మంది ఉగ్రవాదులు నేపాల్‌ సరిహద్దుల నుంచి భారత్‌లోకి ప్రవేశించినట్లు భావిస్తున్నాయి. వీరంతా ఐఎస్‌ఐ, జమాత్‌ ఉల్‌ ముజాహిదీన్‌ బంగ్లాదేశ్‌ ఉగ్ర సంస్థలకు చెందిన వారిగా గుర్తించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే కేంద్రం బంగ్లాదేశ్‌ సరిహద్దును అప్రమత్తం చేసింది. అటు భారత్‌లోకి ప్రవేశించిన ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలకు ఆదేశించింది.

    సైనికుడిని కాపాడేందుకు ఆర్మీ శునకం ప్రాణ త్యాగం

    ఉగ్రవాదుల దాడిలో సైనికుడిని రక్షించే క్రమంలో భారత ఆర్మీకి చెందిన కెంట్ అనే శునకం(6) ప్రాణాలు కోల్పోయింది. నిన్న జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీలో సెర్చ్‌ ఆపరేషన్‌ చేపడుతున్న బృందం.. కెంట్‌ను తీసుకువెళ్లింది. ఉగ్రమూకను పసిగట్టిన కెంట్ సైన్యాన్ని అప్రమత్తం చేసింది. ఈ క్రమంలో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఓ సైనికుడిని ఉగ్రవాదులు చుట్టుముట్టేందు వస్తున్న క్రమంలో వారికి కెంట్ ఎదురెళ్లింది. దీంతో ఉగ్రవాదుల కాల్పుల్లో శునకం తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయింది. https://x.com/ANI/status/1701784499481362778?s=20