• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేటి నుంచి ఓటర్ల చైతన్య యాత్ర

    TG: రాష్ట్రవ్యాప్తంగా 37 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ల చైతన్యయాత్ర చేపట్టనున్నట్లు జాగో తెలంగాణ కన్వీనర్‌ ఆకునూరి మురళి తెలిపారు. ఉదయం 10 గంటలకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌ నుంచి జస్టిస్‌ బి.చంద్రకుమార్‌ యాత్రను ప్రారంభిస్తారన్నారు. 27న తుంగతుర్తిలో, 28న సూర్యాపేట, కోదాడలో, 29న హుజూర్‌నగర్‌, మిర్యాలగూడలో, 30న నల్గొండలో మూడు సమావేశాల చొప్పున జరుగుతాయన్నారు. రెండో విడత యాత్ర నవంబరు 2 నుంచి ప్రారంభమవుతుందని వివరించారు.

    ఓటర్లకు సీఈవో కీలక సూచనలు

    తెలంగాణలో ఎన్నికల కోట్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఓటరు గుర్తింపు కార్డుకు ప్రత్యామ్నాయంగా 12 కార్డులు వినియోగించుకోవచ్చని తెలిపింది. ప్రత్యేక ఓటర్లకు రవాణా సౌకర్యం కల్పిస్తామని పేర్కొంది. మహిళలు, యువత కోసం ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లకు అనుమతి లేదని వెల్లడించింది. ఫిర్యాదుల కోసం 1950ను సంప్రదించాలి ఎన్నికల సంఘం పేర్కొంది.

    ఓటర్ల జాబితా ప్రక్షాళన జరగాలి: ఈసీ

    ఓటర్ల జాబితా ప్రక్షాళన పూర్తి స్థాయిలో జరగాలని ఈసీ పేర్కొంది, అర్హులందరికీ ఓటు హక్కు ఉండడంతో పాటు అనర్హులను తీసివేయాలని స్పష్టం చేసింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. తెలంగాణలో ఈసీ రెండో రోజు పర్యటనలో భాగంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలిస్ కమిషనర్లతో సమావేశమైంది. ఎన్నికల నిర్వహణపై దిశానిర్దేశం చేసింది. ఎన్నిలపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించాలని అధికారులకు ఈసీ స్పష్టం చేసింది.