• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వైసీపీలోకి జేడీ లక్ష్మీనారాయణ.. క్లారిటీ!

    AP: వైసీపీలోకి చేరబోతున్నట్లు వస్తోన్న వార్తలను జేడీ లక్ష్మీనారయణ ఖండించారు. ఆ ఊహాగానాల్లో ఎలాంటి నిజం లేదని పేర్కొన్నారు. ‘శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి గారిని మా పూర్వ విద్యార్థుల కార్యక్రమానికి ఆహ్వానించడానికి కలిశా. అక్కడే వైద్య పరీక్షలకు సంబంధించిన ప్రభుత్వ కార్యక్రమానికి ఆయన నన్ను ఆహ్వానించారు. ఆ సమావేశంలో నేను వైద్య శిబిరాలు, నాడు-నేడు కార్యక్రమాలను అభినందించాను. అంతమాత్రాన నేను అధికార పార్టీలో చేరుతున్నట్లు కాదు’ అని జేడీ స్పష్టం చేశారు.

    వైకాపా బస్సు యాత్ర ప్రారంభం

    AP: వైకాపా సామాజిక సాధికార బస్సు యాత్రను ఇచ్ఛాపురంలో మంత్రి బొత్స సత్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. ‘ఈ యాత్రలో గత నాలుగేళ్లలో అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తాం. కేబినెట్‌లోనూ సామాజిక న్యాయం చేసిన నాయకుడు జగన్‌. వైకాపాకు ఓటు వేయని వారికి సంక్షేమ ఫలాలు అందించాం. విద్యారంగంలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టాం. నాడు-నేడుతో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. పేదల బతుకులు బాగుచేసిన ఘనత సీఎం జగన్‌దే’ అని వైసీపీ నేతలు అన్నారు.

    ‘వాల్తేరు వీరయ్య’ వీక్షించిన వైసీపీ ఎమ్మెల్యే

    AP: శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు చురకలంటించారు. అన్నయ్యను చూసి తమ్ముడు నేర్చుకోవాలంటూ పరోక్షంగా విమర్శించారు. వాల్తేరు వీరయ్య సినిమాను వీక్షించిన అనంతరం మధుసూధన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘చిన్నప్పటి నుంచి అభిమానిగా సినిమాలు చూస్తున్నాం. ఇప్పుడు కార్యకర్తలతో కలిసి వాల్తేరు వీరయ్య సినిమా చూడటం ఆనందంగా ఉంది. అన్నదమ్ముల అనుబంధంతో సినిమా చాలా బాగుంది. అన్నయ్యను చూసి తమ్ముడు నేర్చుకోవాలి’ అంటూ కామెంట్స్ చేశారు. దీంతో పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారంటూ నెట్టింట్లో … Read more