రేపు కరీంనగర్లో కేటీఆర్ పర్యటన
రేపు కరీంనగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. కరీంనగర్లో రూ.7కోట్లతో నిర్మించిన కరీంనగర్ సర్క్యూట్ హౌస్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను ప్రారంభించనున్నారు. అనంతరం హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. కేటీఆర్ పర్యటనను మంత్రి గంగుల కమలాకర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. భద్రతా ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు.