• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘జిగర్ తాండ డబుల్ ఎక్స్ రిలీజ్ డేట్ ఫిక్స్‌’

    రాఘవ లారెన్స్ హీరోగా మరో స్టార్ డైరెక్టర్ ఎస్ జె సూర్యల కాంబోలో వస్తున్న గ్యాంగ్‌ వార్ చిత్రం ‘జిగర్ తాండ డబుల్ ఎక్స్’. ఈ సినిమా తొలి భాగాన్ని తెలుగులో గద్దలకొండ గణేష్‌గా రీమేక్ చేశారు. ఈ సీక్వేల్ సినిమా రిలీజ్ డేట్‌పై కొంతకాలంగా సస్పెన్స్ నడుస్తోంది. ఇప్పుడు లారెన్స్ బర్త్ డే కానుకగా ఆఫిషియల్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. నవంబర్ 10న దీపావళి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.

    ఇప్పుడు ఎట్లా ఉంది అని అడగాలి: కేటీఆర్

    హైదరాబాద్ మహా నగరంను విశ్వ నగరంగా మార్చే క్రమంలో అడుగులు ముందుకు వేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ అన్నారు. ‘ప్రజలను కలిసినప్పుడు 2014లఎట్లా ఉండే… ఇప్పుడు ఎట్లా ఉంది అని అడగాలి. గతంను మరిచి పోయి గందరగోళం పడిపోతాం. ఇది మానవ నైజం. 2014కు ముందు 10 గంటలు కరెంట్ పోయిన అడిగేవాడు వాడు… చెప్పే వాడు లేడు. ఇప్పుడు 10 నిముషాలు కరెంట్ పోతే ఇదేనా బంగారు తెలంగాణ అని సోషల్ మీడియాలో పెడుతున్నారు. కర్ణాటకలో ప్రజలు కరెంట్ లేక రోడ్లు ఎక్కుతున్నారు’ అని … Read more

    భారతీయుడు-2లో బ్రహ్మానందం

    భారతీయుడు-2లో కామెడీ లెజెండ్ బహ్మానందం నటించడం కన్ఫామ్ అయింది. ప్రస్తుతం కీడా కోలాలో ఫుల్ లెంగ్త్ సినిమాలో నటిస్తున్న బ్రహ్మానందం.. ఇండియన్ 2లో ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలిసింది. ఈమేరకు చిత్రబృందం ప్రకటించింది. డైరెక్టర్ శంకర్ పెట్టిన లేటెస్ట్ ట్వీట్‌లో బ్రహ్మానందం పేరుని కూడా మెన్షన్ చేయడంతో ఎలాంటి రోల్‌లో కనిపించనున్నారో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..

    డీకే శివకుమార్‌కు కేటీఆర్ కౌంటర్

    కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ‘కర్ణాటకలు రైతులకు 5 గంటలు కూడా కరెంట్ ఇవ్వని మీరు.. ఇక్కడ రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తున్న మమ్మల్ని తప్పుపడుతారా? అధికారంలోకి వచ్చిన మీరు ఒక్క హామీని అయినా అమలు చేస్తున్నారా? బెంగుళూరులోనూ కరెంట్ కట్‌లతో పరిశ్రల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ముందు మీ రాష్ట్రంలో కరెంట్ కోతలు లేకుండా చూసుకోండి’ అంటూ ఎద్దేవా చేశారు.

    రియల్లీ గ్రేట్ శీతల్… నవ్వొక పాఠం!

    పారా ఆసియా క్రీడల్లో శీతల్ దేవి అద్భుత ప్రదర్శనతో అదరగొట్టింది. రెండు చేతులు లేని శీతల్ ఆర్చరీలో భారత్‌కు రెండు స్వర్ణాలు, ఓ రజతం అందించింది. ఆమె టాలెంట్‌కు ముగ్దుడైన ఆనంద్ మహీంద్రా.. శీతల్‌కు ప్రత్యేక కారును బహుకరిస్తానని పేర్కొన్నాడు. ఈక్రమంలో శీతల్ జీవిత కథ చెప్పే ఓ చిన్న వీడియోను పోస్ట్ చేశారు. ఆమె జీవితం ప్రతిఒక్కరికి పాఠంగా అభివర్ణించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. https://x.com/anandmahindra/status/1718268342132199711?s=20

    ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌కు రోహిత్ శర్మ దూరం?

    ఇంగ్లాండ్‌తో జరగనున్న నేటి మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కానున్నట్ల తెలుస్తోంది. ప్లాక్టిస్ సేషన్‌లో రోహిత్ మణికట్టుకు గాయం అయినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై బీసీసీఐ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఒకవేళ రోహిత్‌ మ్యాచ్‌కు రాకుంటే.. కేఎల్ రాహుల్ కెప్టెన్సీ వహించనున్నాడు. ఇంగ్లాండ్‌పై గెలిస్తే టీమిండియా నేరుగా సెమీస్‌కు వెళ్తుంది. ఇప్పటికే స్టార్ అల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయంతో మ్యాచ్‌లకు దూరమైన సంగతి తెలిసిందే.

    తెలంగాణలో పోటీకి టీడీపీ దూరం

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌తో ములాఖత్‌లో చెప్పారు. ఏపీలో ప్రస్తుత రాజకీ పరిస్థితుల దృష్ట్యా తెలంగాణపై ఫొకస్ పెట్టలేమని తెలిపారు. ఎందుకు ఎన్నికల్లో పోటీ చేయలేకపోతున్నమో టీడీపీ కార్యకర్తలకు వివరించాలని ఆయన సూచించారు. దీంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తప్పుకున్నట్లైంది.

    విశ్వక్ సేన్ సంచలన వ్యాఖ్యలు

    యంగ్ హీరో విశ్వక్ సేన్ తను తాజాగా నటించిన చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం విడుదలపై పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. ‘ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే ప్రతి ఒక్కడూ మన గేమ్‌ మారుద్దాం అని చూస్తాడు. డిసెంబర్ 8న వస్తున్నాం. హిట్, ప్లాప్, సూపర్ హిట్ అనేది ప్రేక్షకుల నిర్ణయం. తగ్గేకొద్ది ఇంకా ఇబ్బంది పెట్టాలని చూస్తారు. డిసెంబర్ 8న సినిమా రిలీజ్ కాకపోతే.. ఇకపై ప్రమోషన్లలో కూడా పాల్గొనను’ అని పోస్ట్ చేశాడు,

    చంద్రబాబుకు కంటి సమస్య

    రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబుకు కంటి సమస్య ఉందని ప్రభుత్వ వైద్యులు నిర్ధారించారు. సివిల్ సర్జన్ బీ.శ్రీనివాసరావు చంద్రబాబును టెస్ట్ చేసి దృష్టి సమస్య ఉందని స్పష్టం చేశారు. కుడి కంటిలో క్యాటారాక్ట్ ఉందని దానికి ఆపరేషన్ చేయాలని చెప్పారు. వెంటనే శస్త్ర చికిత్స చేయకుంటే కుడి, ఎడమ కంటి చూపుల్లో తేడా ఎక్కువ అవుతుందని పేర్కొన్నారు.

    పరిగికి నీళ్లు ఎందుకు తేలేదు: రేవంత్

    కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే కేసీఆర్‌ రెండుసార్లు సీఎం అయ్యారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ‘కేసీఆర్‌ కుటుంబంలో అందరికి పదవులు వచ్చాయి. ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీళ్లు ఇస్తామన్నారు ఏమైంది?.. కొడంగల్‌ వరకు గోదావరి జలాలు తీసుకొస్తామని వైఎస్సార్ హామీ ఇచ్చారు.. ఏపీవాళ్లు తెలంగాణ నీళ్లు తీసుకెళ్లారని కేసీఆర్‌ ఆనాడు విమర్శించారు. పరిగికి కేసీఆర్‌ ఎందుకు నీళ్లు తీసుకురాలేదు? భూముల్ని ఆక్రమించిన మిమ్మల్ని వదిలిపెట్టం’ అని హెచ్చరించారు.