• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అప్పులు తప్ప అభివృద్ధి లేదు: పురందేశ్వరి

    ఏపీ ప్రభుత్వంపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వానికి అప్పులు చేయడంపై ఉన్న శ్రద్ధ అభివృద్ధి చేయడంలో లేదన్నారు. పేదలకు గృహాలు, సంక్షేమ పథకాలను కేంద్రమే అందిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కేంద్ర నిధులతోనే జరుగుతోందని తెలిపారు. ఆ నిధులను తమ నిధులుగా చెప్పుకుంటూ వైసీపీ గొప్పలకు పోతుందని విమర్శించారు. ఏపీ రాజధాని అమరావతికి పెద్ద ఎత్తున కేంద్రం నిధులు మంజూరు చేసిందని పురందేశ్వరి పేర్కొన్నారు.

    పవన్‌ది నాది ఒకే మనస్తత్వం: బాలకృష్ణ

    జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ది.. తనది ఒకే మనస్తత్వమని ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. ఇద్దం ముక్కుసూటిగా మాట్లాడే అలవాలు ఉందన్నారు. టీడీపీ, జనసేన పార్టీలు కలవటం నవశకానికి నాంది అని పేర్కొన్నారు. కలసికట్టుగా ముందుకు సాగుదామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అరాచకపాలన సాగుతోందని ఆరోపించారు. టీడీపీ పాలనలో రూ.23 కోట్లతో నిర్మించిన బసవతారకరామ మాతాశిశు ఆసుపత్రి వద్ద సెల్ఫీ తీసుకొని వైసీపీ ప్రభుత్వానికి ఛాలెంజ్‌ విసిరారు.

    శ్రీవారిమెట్ల మార్గంలో చిరుత సంచారం

    తిరుమల శ్రీవారిమెట్ల మార్గంలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. భక్తులు రోడ్డు దాటుతున్న సమయంలో చిరుతను చూసి భయాందోళనకు గురయ్యారు. వెంటనే భక్తులు టీడీపీ సెక్యూరిటీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో టీటీడీ కాలినడక భక్తులను గుంపులుగా అనుమతిస్తుంది. వాటర్‌ హౌస్‌ వద్ద భక్తులను నిలిపి గుంపులుగా పంపుతున్నారు.

    అడిగిన బ్రాండ్ ఇవ్వలేదని మద్యం షాపుకు నిప్పు

    AP: తనకు కావాల్సిన బ్రాండ్‌ మద్యం లేదన్న కోపంతో ఓ వ్యక్తి మద్యం షాపుకు నిప్పుపెట్టాడు. ఈ ఘటనలో రూ.2 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లింది. విశాఖపట్నం పీఎం పాలెంలో మధు (53) అనే వ్యక్తి మద్యం షాపుకు వెళ్లాడు. ఓ బ్రాండ్‌ మద్యం ఇవ్వాల్సిందిగా కౌంటర్‌లో అడిగాడు. ఆ బ్రాండ్‌ మద్యం షాపులో లేదని వ్యక్తి చెప్పడంతో వారితో గొడవకు దిగాడు. దీంతో మధు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఓ బాటిల్లో పెట్రోలు తీసుకొచ్చి షాపు కౌంటర్‌పై కుమ్మరించి నిప్పు అంటించాడు. … Read more

    బాకీ డబ్బులు అడుగుతున్నాడని చంపేశాడు..

    AP: తీసుకున్న అప్పును తిరిగి అడిగినందుకు యువకుడిని ఓ వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. వైఎస్‌ఆర్‌ జిల్లాకు చెందిన సాయికిరణ్‌ కొంతకాలం సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేసి మానేశాడు. ఈ క్రమంలో అతడికి పరిచయమైన మహేంద్ర అనే వ్యక్తికి సాయి రూ.50 వేలు అప్పుగా ఇచ్చారు. అప్పుతీర్చమని మహేంద్రను, సాయి ఒత్తిడి చేయడందో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన మహేంద్ర తన వద్ద ఉన్న కత్తితో సాయికిరణ్‌ కడుపులో పొడవడంతో అతడు మృతి … Read more

    మైసూరులో ‘సామిరంగ’ టీమ్

    నాగార్జున హీరోగా విజయ్‌ బిన్నీ దర్శకత్వంలో ‘నా సామిరంగ’ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే.. అల్లరి నరేశ్‌, రాజ్‌ తరుణ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం మైసూర్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో ఓ పాటని కూడా తెరకెక్కించనున్నట్టు సినీ వర్గాలు తెలిపాయి. సంక్రాంతి సందర్భంగా విడుదల ఖరారు చేసుకున్న ఈ సినిమా వేగంగా చిత్రీకరణ చేసుకుంటోంది. నాగార్జున ఒక పక్క ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొంటూనే, మరోపక్క బిగ్‌బాస్‌ షోని నిర్వహిస్తున్నారు.

    యువతను జగన్‌‌ను మోసం చేశారు: లోకేష్

    సీఎం వైఎస్‌ జగన్‌‌పై టీడీపీ నేత నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వ చర్యలకు యువత బలి అవుతోందని ఆరోపించారు. జగన్‌ మాయమాటలు నమ్మి యువత మోసపోయిందన్నారు. మేనిఫెస్టోలో ప్రకారం ఏటా జనవరి 1నే జాబ్‌ క్యాలెండర్‌ ఇస్తున్నారా అని ప్రశ్నించారు. ఏటా 2 లక్షలకుపైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ అని చెప్పి యువతను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు రాక.. ఉపాధి లేక యువత తీవ్ర ఆందోళనలో ఉన్నారని లోకేష్ తెలిపారు.

    ఆర్టీసీ బస్సుల రద్దు.. నేతలు ఆగ్రహం

    ఎమ్మార్పీఎస్‌ నేతలు బుక్‌ చేసుకున్న ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులను అధికారులు చివరి నిమిషంలో రద్దు చేశారు. దీనిపై ఎమ్మర్పీఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం బస్సులు బుక్‌ చేసుకోగా నేటి సాయంత్రం అవి బయలుదేరాల్సి ఉంది. ఇంతలో వీటిని రద్దుచేసినట్లు నేతలకు ఆర్టీసీ సమాచారం ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇలా ఆఖరి క్షణాల్లో బస్సులను రద్దు చేయడంపై డిపోల అధికారులతో వాగ్వాదం కూడా జరిగింది.

    చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

    స్కిల్‌డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు దాఖలు చేసినబెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. విచారణను ఈనెల 15కి వాయిదా చేస్తున్నట్టు తీర్పు ఇచ్చింది. విచారణకు ఏజీ హాజరు కాలేకపోతున్నట్లు సీఐడీ కోర్టుకు తెలిపింది. తమకు తగిన సమయం కావాలని కోరింది. దీంతో న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది. మరోసారి గడువు పొడిగించేది లేదని తేల్చిచెప్పింది.

    కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన కమల్‌హాసన్‌

    సూపర్‌స్టార్‌ కృష్ణ విగ్రహావిష్కరణ వేడుక ఘనంగా జరిగింది. విజయవాడ గురునానక్‌ కాలనీలోని కేడీజీవో పార్కులో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని హీరో కమల్‌హాసన్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేత దేవినేని అవినాష్‌, పెద్ద ఎత్తున కృష్ణ, మహేశ్‌బాబు అభిమానులు పాల్గొన్నారు. ‘ఇండియన్‌-2’ సినిమా చిత్రీకరణ కోసం కమల్‌హాసన్‌ విజయవాడ వచ్చారు. దీనిలో భాగంగానే కృష్ణ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.