• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వీల్‌చైర్‌లో వచ్చి ఎంపీ నామినేషన్‌

    మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. ఆస్పత్రి నుంచి అంబులెన్స్‌లో వచ్చి నామినేషన్‌ దాఖలు చేశారు. దుబ్బాకలో అంబులెన్స్‌ దిగి వీల్‌చైర్‌లో రిటర్నింగ్‌ కార్యాలయానికి వచ్చి నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. అయితే ఇటీవల ప్రభాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఉండగా ఓ యువకుడి చేతిలో కత్తిపోటుకు గురైన ఆయనకు శస్త్రచికిత్స జరిగింది. దీంతో ఆయన హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

    గజ్వేల్‌లో కేసీఆర్ నామినేషన్

    సీఎం కేసీఆర్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. గజ్వేల్‌లోని సమీకృత భవనంలో రిటర్నింగ్‌ అధికారికి రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలను అందజేశారు. కామారెడ్డిలోనూ పోటీ చేస్తున్న కేసీఆర్.. మధ్యాహ్నం 2 గంటలకు అక్కడ నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. మరోవైపు సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి ఆయన సమర్పించారు.

    రోడ్డు ప్రమాదంలో తల్లీ, కుమార్తెలు మృతి

    TS: మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలంnలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తల్లి తన ఇద్దరు పిల్లలతో స్కూటీపై వెళ్తుండగా ఓ వాహనం వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురూ అక్కడికక్కడే మృతిచెందారు. మేడ్చల్‌ నుంచి తూప్రాన్‌ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

    ప్రజలు విచక్షణతో ఓటు వేయాలి: KCR

    ఎన్నికల్లో ప్రజలు విచక్షణతో ఓటు వేయాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ మాట్లాడారు. సేవ చేసే వ్యక్తులకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. 2004 ఎన్నికలకు ముందు తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చిందన్నారు. ఎన్నికలు అవగానే ఇచ్చిన హామీని ఆ పార్టీ విస్మరించిందని చెప్పారు. బీఆర్‌ఎస్ పోరాటానికి భయపడి కాంగ్రెస్‌ ప్రత్యేక తెలంగాణ ఇచ్చిందని తెలిపారు.

    బీజేపీకి జనసేన సంపూర్ణ మద్దతు: పవన్

    తెలంగాణ ఎన్నికల్లో బీజేపీకి జనసేన సంపూర్ణ మద్దతిస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. రాష్ట్రంలో బీసీ నాయకత్వం రావాలని ఆకాంక్షించారు. బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధాని మోదీతో కలిసి పవన్‌ పాల్గొన్నారు. బీసీని ముఖ్యమంత్రి చేస్తామనే మాటకు బీజేపీ కట్టుబడి ఉందని చెప్పారు. మోదీలాంటి ప్రధాని ఉన్నప్పుడు అభివృద్ధి చేసుకోవడానికి ఉన్న అవకాశాలను రెండు రాష్ట్రాల నేతలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తెలంగాణ సాధనలో విజయం సాధించాం కానీ.. రాష్ట్ర అభ్యున్నతిలో సాధించాలేదని పవన్‌ అన్నారు.

    తండ్రి మందలించాడని కుమార్తె ఆత్మహత్య

    TS: తండ్రి మందలించాడని ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన జగద్గిరిగుట్టలో చేటుచేసుకుంది. స్థానికంగా ఉంటున్న స్వామిగౌడ్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతని కుమార్తె దివ్య డిగ్రీ పూర్తిచేసి ఓ ప్రైవేటు ఉద్యోగం చేసింది. ప్రస్తుతం ఖాళీగా ఉంది. ఈ క్రమంలో ఇంట్లో టీవీ, ఫోన్‌ చూస్తూ కాలం గడుపుతుండటంతో తండ్రి మందలించాడు. మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

    కేసీఅర్‌ను ఇంటికి పంపాలి: మోదీ

    తెలంగాణలో భాజపా అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. మీ అందరి ఆశీర్వాదంతోనే ప్రధాని అయ్యానని బీసీ ఆత్మగౌరవ సభలో అన్నారు. ‘తెలంగాణ ప్రజలు భాజపాపైనే విశ్వాసంతో ఉన్నారు. రాష్ట్రంలో తొమ్మిదేళ్లుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ విరోధి అధికారంలో ఉన్నారు. ఆయన్ని ఇంటికి పంపాల్సిన అవసరం ఉంది. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం వచ్చింది. వాటితోనే భారాస మోసం చేసింది. బీసీల ఆకాంక్షలను పట్టించుకునేది భాజపా మాత్రమే’ అని మోదీ అన్నారు.

    ఆ మూడు పార్టీలు ఒకటే: కిషన్‌రెడ్డి

    TG: భారాస, కాంగ్రెస్‌, మజ్లిస్‌ ఒకటేనని తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. భాజపా బీసీ ఆత్మగౌరవ సభలో ఆయన ప్రసంగించారు. మన్మోహన్‌ హయాంలో కేసీఆర్‌ మంత్రిగా ఉన్నారని, తెరాస నేతలు మంత్రులుగా ఉన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అమ్ముడు పోయే పార్టీ అని, భారాస కొనుగోలు చేసే పార్టీ అని విమర్శించారు. ఈ రెండూ అవినీతి పార్టీలేనని ఆరోపించారు. ఈ రెండు పార్టీల డీఎన్‌ఏ ఒక్కేటనన్నారు.

    సీఎం కేసీఆర్‌కు పవన్‌ చురకలు

    TG: సకల జనులు సమరం చేస్తేనే తెలంగాణ వచ్చిందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన భాజపా బీసీ ఆత్మగౌరవ సభలో ఆయన ప్రసంగించారు. ‘తెలంగాణ సాధించినా నీళ్లు, నిధులు, నియామకాలు అందరికీ అందని పరిస్థితి ఉంది. ప్రధాని మోదీ ఎన్నికలనే దృష్టిలో పెట్టుకొని ఉంటే ఆర్టికల్‌ 370ని రద్దు చేసేవారు కాదు. ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకునేవారు కాదు. నాలాంటి కోట్ల మంది కన్న కలలకు ప్రతిరూపమే మోదీ’ అని పవన్‌ అన్నారు.

    డబ్బుకు ఓటు అమ్ముకోవద్దు: కేసీఆర్‌

    TG: డబ్బుకు ఓటు అమ్ముకోవద్దని భారాస అధినేత కేసీఆర్‌ ప్రజలకు సూచించారు. చెన్నూరు సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘ప్రజాస్వామ్య ప్రక్రియలో ఇంకా పరిణతి రావాలి. ఎన్నికల వేళ ప్రజలు విచక్షణతో ఓటు వేయాలి. ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం. మనం వేసే ఓటే మన భవిష్యత్తు.. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుంది. తెలంగాణ రాకముందు.. వచ్చాక.. రాష్ట్రంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. వాటిని ప్రజలు గమనించాలి.. ఆలోచించాలి. ఆ తర్వాతనే ఓటు వేయాలి’ అని కేసీఆర్‌ ప్రజలను కోరారు.