• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చిరంజీవి 156వ చిత్రం ప్రారంభం

    మెగాస్టార్ చిరంజీవి 156వ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ మూవీని దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్నాడు. ఎం.ఎం.కీరవాణి సంగీతమందిస్తున్నారు. సినిమా ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు రాఘవేంద్రరావు క్లాప్‌ కొట్టారు. అల్లు అరవింద్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ఈ చిత్రం ఫాంటసీ అడ్వెంచర్‌గా ముస్తాబవుతోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి.

    వినరో భాగ్యము విష్ణు కథ నుంచి పాట విడుదల

    టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్‌ అబ్బవరం నటిస్తున్న వినరో భాగ్యము విష్ణు కథ చిత్రం నుంచి లిరికల్ సాంగ్ విడుదల అయ్యింది. దర్శనా అంటూ సాగే ఈ పాట అలరిస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. కిరణ్ సరసన కశ్మీరా నటిస్తోంది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకుంటుంది. ఇక పాటలు కూడా అలరిస్తుండటంతో సినిమా విజయంపై చిత్రబృందం నమ్మకంతో ఉంది.

    హీరోయిన్‌తో చిందులు వేసిన దర్శక, నిర్మాతలు

    హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌తో కలసి నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు సుకుమార్‌లు [డ్యాన్స్](url) చేశారు. ‘18 పేజెస్’ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో మూవీ యూనిట్ పార్టీ ఇచ్చింది. ఈ వేడుకలో అనుపమతో కలసి అరవింద్, సుకుమర్ కాలు కదిపి సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను హీరో నిఖిల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. కాగా ఈనెల 23న ‘18 పేజెస్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం అందుకుంది. Look who are Happy And Dancing … Read more

    చిరంజీవి, బాలకృష్ణతో సినిమా: అల్లు అరవింద్

    తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్దనిర్మాతల్లో ఒకరైన అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి, బాలకృష్ణ కాంబినేషన్‌లో సినిమా తీయాలని ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న బాలయ్య అన్‌స్టాపబుల్‌ కార్యక్రమానికి సురేశ్‌ బాబుతో కలిసి వెళ్లారు. ఇందులో వివిధ ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తనతో సినిమా ఎందుకు చేయలేదని ప్రశ్నించగా.. చిరంజీవి, బాలయ్యతో కలిసి తీయాలని ఉందన్నారు. సంక్రాంతికి ఎన్ని థియేటర్లు ఇస్తారని బాలయ్య సరాదాగా ప్రశ్నించారు.

    ‘ఈ సినిమాలో రాశిఖ‌న్నాను తీసుకోమ‌ని నేనే చెప్పా’

    ‘ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్’ మూవీలో హీరోయిన్ పాత్ర‌కు రాశిఖ‌న్నా అయితే బాగుంటుంద‌ని నేనే చెప్పాన‌ని నిర్మాత అల్లు అర‌వింద్ అన్నాడు. చెప్పిన‌ట్లుగానే ఆమె లాయ‌ర్ క్యారెక్ట‌ర్‌లో చాలా బాగా న‌టించింద‌ని చెప్పాడు. నిన్న ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ వేడుక‌లో అల్లు అర‌వింద్ ఈ వ్యాఖ్య‌లు చేశాడు. గోపిచంద్, రాశిఖ‌న్నా క‌లిసి క‌నిపించే సీన్ల‌లో చాలా బాగా న‌వ్వుకుంటార‌ని వెల్ల‌డించాడు. ఈ సినిమాను ఒక ప్రేక్ష‌కుడిగా చూసి చాలా ఎంజాయ్ చేశాను. మారుతీకి ప్రేక్ష‌కుల‌ను ఎలా న‌వ్వించాలో బాగా తెలుసున‌ని పేర్కొన్నాడు.