ఎందుకు వస్తలేవు.. పిలిస్తే కదా వస్తా
తెలంగాణ శాసనసభలో మంత్రి కేటీఆర్, భాజపా ఎమ్మెల్యేల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. గవర్నర్ ప్రసంగానికి ముందు ఎమ్మెల్యేలు ఈటల, రఘునందన్, రాజాసింగ్ వద్దకు కేటీఆర్ వచ్చి ప్రత్యేకంగా మాట్లాడారు. హుజురాబాద్లో జరిగిన అధికారిక కార్యక్రమంలో ఎందుకు పాల్గొనలేదని ఈటలను ప్రశ్నించగా.. పిలిస్తే కదా హాజరయ్యేది అని సమాధానం ఇచ్చారు. కనీసం కలెక్టర్ నుంచైనా ఆహ్వానం ఉండాలనగా.. కేటీఆర్ నవ్వి ఊరుకున్నారు. కాషాయరంగు చొక్కా కళ్లకు గుచ్చుకుంటుందని రాజాసింగ్తో వ్యాఖ్యనించగా.. భవిష్యత్లో మీరు వేసుకోవచ్చని సరాదాగా అన్నారు. Screengrab Twitter:ktrbrs Screengrab Twitter:eatalarajender