• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జగన్‌పై లోకేష్ విమర్శలు

    టీడీపీ నేత నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ‘వాహ్.. ఒక్క యూనిట్ కూడా వాడని ఇంటికి రూ.295 కరెంట్ బిల్లు బాదుడు. సొంత పేపర్, ఛానెల్, సిమెంట్, విద్యుత్ కంపెనీలు, ఊరికో ప్యాలెస్ ఉన్న అవినీతి అనకొండ, పెత్తందారుడు జగన్ పేదలకి రూపాయి స్కీం ఇచ్చి వెయ్యి రూపాయలు దోచే స్కాం. జనాన్ని క్యాన్సర్ గడ్డలా పట్టి పీడిస్తున్న నువ్వు బిడ్డ ఎలా అవుతావు జగన్?’ అని లోకేష్ విమర్శించారు.

    దిశ యాప్ పేరుతో ఏదో దందా నడుస్తోంది: లోకేష్

    జగనాసుర పాలనలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయని టీడీపీ నేత నారా లోకేష్ విమర్శించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ‘తెచ్చిన దిశా చట్టంకి దిక్కూ మొక్కూ లేదు. మహిళల భద్రతకు అంటూ సర్కారు తెచ్చిన దిశ యాప్ పేరుతో ఏదో దందా నడుస్తోంది. మహిళలు వేసుకోవాల్సిన దిశ యాప్ పురుషుల మొబైల్ లో బలవంతంగా డౌన్లోడ్ చేయించడం అనుమానాలకి తావిస్తోంది. దేశ భద్రత కోసం తన ప్రాణాలను పణంగా పెట్టే సైనికుడు, ఏపీకి వస్తే ఆయన ప్రాణాలకు రక్షణ లేని దుస్థితి’. … Read more

    జగన్ సిగ్గుతో తలదించుకోవాలి: లోకేష్

    జగన్‌ అసమర్థ పాలన రాష్ట్ర ప్రజలకు శాపమైందని టీడీపీ నేత లోకేష్ ఆరోపించారు. చెట్ల కింద రోగుల దుస్థితి.. జగన్ చేతగాని పాలనకు అద్దం పడుతోందన్నారు. గిరిజన తండాల ప్రజలకు అండగా ఉన్న ధర్మాస్పత్రిలో మూడేళ్లుగా చెట్లకిందే వైద్యసేవలు అందిస్తున్నారంటే జగన్ సిగ్గుతో తలదించుకోవాలంటూ మండిపడ్డారు. జగన్ దివాలా కోరు పాలన పుణ్యమా అని కర్నూలు, అనంతపురం వంటి బోధనాస్పత్రుల్లోనే దూది సైతం అందుబాటులో లేని దుస్థితి నెలకొందని లోకేష్ విమర్శించారు.

    మీ అభిమానం మర్చిపోలేనిది: చంద్రబాబు

    రాజమహేంద్రవరం జైలు నుంచి విడుదలైన చంద్రబాబు పార్టీ శ్రేణులనుద్దేశించి మాట్లాడారు. కష్టకాలంలో తెలుగు ప్రజలు చూపిన అభిమానం ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపారు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు 52 రోజులుగా రోడ్లపైకి వచ్చి ఎక్కడికక్కడ సంఘీభావం తెలిపారని గుర్తుచేసుకున్నారు. సంఘీభావం తెలపడమే కాకుండా తాను చేసిన అభివృద్ధిని కూడా వివరించారని కొనియాడారు. తనకు మద్దతుగా నిలిచిన ప్రపంచంలోని తెలుగువారందరికీ పేరు పేరునా చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.

    చంద్రబాబును చంపేస్తామంటున్నారు: నారా లోకేష్

    జైలులో ఉన్న చంద్రబాబును చంపేస్తామని వైసీపీ నేతలు బాహాటంగానే చెబుతున్నారని టీడీపీ నేత నారా లోకేష్ ఆరోపించారు. ‘ఏ తప్పూ చేయకపోయినా వ్యక్తిగత కక్ష్యతోనే ఆయనను అరెస్టు చేశారు. కేసులతో సంబంధంలేని నా తల్లిని కూడా జైలుకు పంపిస్తామని వైసీపీ నేతలు అంటున్నారు. 50 రోజులుగా చంద్రబాబును జైలులో ఉంచి ఏం సాధించారు. ఒక్క ఆధారం కూడా ప్రజల ముందుకు తీసుకురాలేక పోయారు. మా ఆస్తుల వివరాలు ఐటీ రిటర్న్‌లు ప్రజల ముందుంచేందుకు సిద్ధంగా ఉన్నాం’. అని లోకేష్ పేర్కొన్నారు.

    అందుకే పవన్‌ను ప్యాకేజీ స్టార్ అంటారు: అంబటి

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. పవన్‌కు స్వాంత రాజకీయ ఆలోచన లేదన్నారు. చివరకు లోకేష్ పల్లకి మోసేందుకు పవన్ రెడీ అయ్యారని విమర్శించారు. టీడీపీని కాపాడేందుకు పవన్ ప్రత్నిస్తున్నాడని చెప్పారు. అందుకే పవన్‌ని ప్యాకేజీ స్టార్ అంటారని ఎద్దేవా చేశారు. సున్నా సున్నా కలిస్తే వచ్చేది సున్నానే అని టీడీపీ-జనసేన కలిస్తే కూడా అంతేనన్నారు. చంద్రబాబు నేరం చేశారు కాబట్టే జైల్లో ఉన్నారని అంబటి ఆరోపించారు.

    టీడీపీ- జనసేన తొలి భేటీ డేట్ ఖరారు

    టీడీపీ – జనసేన సమన్వయ కమిటీ భేటీ తేదీ ఖరారైంది. ఈ నెల 23న రాజమండ్రిలో టీడీపీ-జనసేన తొలి సమావేశం జరగనుంది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు లోకేశ్- పవన్ కళ్యాణ్‌ల అధ్యక్షతన తొలి జాయింట్ యాక్షన్ కమిటీ భేటీ జరగనుంది. ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటం, ఉద్యమ కార్యాచరణ, తాజా రాజకీయ పరిణామాలు, ఇరు పార్టీల సమన్వయంపై కమిటీ చర్చించనుంది. ఇప్పటికే జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులను ఇరు పార్టీలు ప్రకటించాయి.

    నారా భువనేశ్వరి కీలక నిర్ణయం

    చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘నిజం గెలవాలి’ పేరుతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లనున్నారు. వచ్చే వారం నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భువనేశ్వరి పర్యటించనున్నారు. చంద్రబాబు అరెస్టు కారణంగా ఆవేదనతో మృతి చెందిన కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. అలాగే చంద్రబాబు నిర్వహిస్తున్న భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమాన్ని లోకేష్ ప్రారంభించున్నారు. చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత లోకేష్ యువగళం పాదయాత్రకు ప్రారంభిస్తారు.

    లోకేష్, భువనేశ్వరి భావోద్వేగం

    జైలులో చంద్రబాబును కలిసి ఆయన సతీమణి భువనేశ్వరి, లోకేష్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. చంద్రబాబు ఆరోగ్యపరిస్థితి ఆందోళన చెందారు. ములాఖత్‌ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడకుండానే భువనేశ్వరి, లోకేష్ దుఃఖంతో నేరుగా బస కేంద్రానికి వెళ్లిపోయారు. జైలులో చంద్రబాబును చూసి చాలా బాధేసిందని కాసాని జ్ఞానేశ్వర్‌ తెలిపారు.

    లోకేష్ ట్వీట్ బాధ కలిగించింది: KTR

    చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై లోకేష్ ట్వీట్ బాధను కలిచిందని మంత్రి కేటీఆర్ అన్నారు. కుమారుడిగా లోకేష్ ఆవేదన ఎలా ఉంటుందో తనకు తెలుసన్నారు. కేసీఆర్ నిరాహార దీక్ష సమయంలో తనకు ఆందోళన కలిగిందని చెప్పారు. హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలనే చంద్రబాబు అరెస్టుపై ఆందోళనలు వద్దంటున్నానని కేటీఆర్ పేర్కొన్నారు.