• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘వినరో భాగ్యము విష్ణు కథ’ టీజర్ రిలీజ్

    టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘వినరో భాగ్యము విష్ణు కథ’ మూవీ టీజర్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. అల్లు అరవింద్ పుట్టినరోజు సందర్భంగా ఈ టీజర్ విడుదల చేశారు. ఈ సినిమా తిరుమల తిరుపతి నేపథ్యంలో.. లవ్, కామెడీ, థ్రిల్లర్, సస్పెన్స్‌తో తెరకెక్కుతోంది. కిరణ్ సరసన కశ్మీర పర్దేశీ నటిస్తోంది. ఈ చిత్రానికి మురళి కిషోర్ అబ్బురు దర్శకత్వం వహిస్తున్నాడు. అల్లు అరవింద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరి 17న విడుదల కానుంది.

    ‘మాస్ మొగుడు’ వచ్చేశాడు

    నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘వీరసింహారెడ్డి’ మూవీ నుంచి మరో సాంగ్ రిలీజైంది. జనవరి 9న మాస్ మొగుడు పాటను ఈ చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాట అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ఈ పాట నందమూరి అభిమానులను కట్టిపడేస్తోంది. కాగా ఈ మూవీలో బాలయ్య సరసన శృతిహాసన్ కథానాయికగా నటించింది. డైరెక్టర్ గోపీచంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించారు. సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు.

    ‘శాకుంతలం’ ట్రైలర్ రిలీజ్; దుమ్ములేపిన సామ్

    స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన దృశ్యకావ్యం ‘శాకుంతలం’ ట్రైలర్‌ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. ట్రైలర్‌ను బట్టి చూస్తే ఈ సినిమాలో సమంత అద్భుతంగా నటించినట్లు తెలుస్తోంది. మూవీ విజువల్స్ కళ్లు చెదిరే రీతిలో ఉన్నాయి. శకుంతల పాత్రలో సమంత.. దుష్యంతుడి పాత్రలో దేవ్ మోహన్ నటించారు. ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహించారు. మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

    ‘వీరసింహారెడ్డి’ మేకింగ్ వీడియో చూశారా?

    నందమూరి బాలకృష్ణ హీరోగా, శృతిహాసన్ హీరోయిన్‌గా నటించిన ‘వీరసింహారెడ్డి’ చిత్రం నుంచి ఫ్యాన్స్‌కు న్యూఇయర్ గిఫ్ట్ వచ్చింది. ఈ మూవీ మేకింగ్ వీడియోను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. న్యూ ఇయర్ సందర్భంగా ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు. మేకింగ్ వీడియోలో బాలయ్య యాక్షన్ అదిరిపోయింది. కాగా ఈ సినిమాకు గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఈ మూవీ తెరకెక్కింది. సంక్రాంతి కానుకగా వచ్చే నెల 12న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నారు.

    ప్రభాస్ ప్రోమో వచ్చేసింది

    అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబెల్‌స్టార్ ప్రభాస్ అన్‌స్టాపబుల్2 ప్రోమో వచ్చేసింది. ఈ ఎపిసోడ్‌లో ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్, హీరో గోపీచంద్ కూడా సందడి చేశాడు. ఈ ప్రోమోలో ఈ ఇద్దరి యంగ్ హీరోలతో హోస్ట్ బాలకృష్ణ తెగ అల్లరి చేశారు. ప్రభాస్‌కు సంబంధించిన పర్సనల్ విషయాల గురించి బాలయ్య ఆరాతీశాడు. తనను కూడా డార్లింగ్ అంటూ పిలవాలని ప్రభాస్‌ను బాలకృష్ణ కోరాడు. పెళ్లి ఎప్పుడు అనగా సల్మాన్‌ఖాన్ పెళ్లి తర్వాత అంటూ ప్రభాస్ నవ్వులు పూయించాడు.

    ‘స్పైడర్‌మ్యాన్’ ట్రైలర్ వచ్చేసింది

    ప్రపంచవ్యాప్తంగా స్పైడర్‌మ్యాన్ చిత్రాలకు ఎనలేని క్రేజ్ ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ‘స్పైడర్‌మ్యాన్’- అక్రాస్ దస్పైడర్ వెర్స్ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం ‘స్పైడర్‌మ్యాన్’ మూవీ ట్రైలర్ లాంఛ్ అయింది. అభిమానులను ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి ముగ్గురు డైరెక్టర్లు దర్శకత్వం వహించడం విశేషం. షామీక్ మూర్, హైలీ స్టైన్‌ఫెల్డ్, ఆస్కార్ ఇసాక్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీని వచ్చే ఏడాది జూన్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు.

    ఇంట్రెస్టింగ్‌గా ‘కనెక్ట్’ ట్రైలర్

    లేడీ సూపర్‌స్టార్ నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘కనెక్ట్’ మూవీట్రైలర్ విడుదల అయ్యింది. ట్రైలర్ మొదటి నుంచి చివరి వరకూ భయంభయంగా సాగింది. పూర్తిగా హార్రర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు ఇంటర్వెల్ లేకపోవడం విశేషం. ఈ మూవీని అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించారు. సత్యరాజ్, అనుపమ్ ఖేర్, నాఫియా తదితరులు కీలక పాత్రలు పోషించారు.డిసెంబర్ 22న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.

    ఫుల్ ఎనర్జిటిక్‌గా ‘జై బాలయ్య’ సాంగ్

    నటసింహం నందమూరి బాలక్రిష్ణ హీరోగా తెరకెక్కిన వీరశివారెడ్డి చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది. ‘జై బాలయ్య’ పాటను మూవీ మేకర్స్ విడుదల చేశారు. హీరో పాత్రను తెలియజేసేలా ఈ సాంగ్‌ను చిత్రీకరించారు. ఈ పాటకు థమన్ సంగీత స్వరాలు సమకూర్చారు. కాగా ఈ సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం ఫ్యాక్షన్, యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించారు.

    ఉత్కంఠగా ‘మాయాపేటిక’ ఫస్ట్ గ్లింప్స్

    ‘మాయాపేటిక’ ఫస్ట్ గ్లింప్స్ వీడియోను చిత్ర బృదం రిలీజ్ చేసింది. ఫస్ట్ గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుంటోంది. సెల్ ఫోన్ వల్ల ప్రపంచం తల దించుకుని బతకాల్సి వచ్చిందంటూ నటుడు రానా చెప్పే వాయిస్ ఓవర్ సినిమాపై ఆసక్తిని రేపుతోంది. ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్, సునీల్, పృధ్వీ, హిమజ, శ్రీనివాసరెడ్డి, విరాజ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ రమేష్ రాపర్తి తెరకెక్కించారు. ఈ చిత్రానికి మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

    ఆలోచింపజేస్తున్న పవన్ స్పెషల్ వీడియో

    సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఓ స్పెషల్ వీడియో ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ [వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో ఏముందంటే.. ‘‘వందల ఏళ్లు పాలించిన బ్రిటీషర్లను ఇప్పుడు రిషి సునాక్ ఏలుతున్నాడు. అలాంటిది ఏపీలో స్వేచ్ఛగా ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేకపోతున్నాం. నిరంకుశతత్వాన్ని ప్రశ్నించాలి’’ అంటూ ఆయన వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఈ వీడియో నెటిజన్లను, అభిమానులను ఆలోచింపజేస్తోంది. pic.twitter.com/qGQrRnaIvf — Pawan Kalyan (@PawanKalyan) November 8, 2022