• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రమాదంపై సీఎం, గవర్నర్‌ దిగ్భ్రాంతి

    HYD: నాంపల్లిలో జరిగిన అగ్నిప్రమాదంపై గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో ఉన్నవారికి మెరుగైన చికిత్స అందించాలని సీఎస్‌కు గవర్నర్‌ సూచించారు. ఘటనకు కారణాలు, తీసుకున్న చర్యలపై రెండ్రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మరోవైపు మృతుల కుటుంబానికి సంతాపం తెలిపిన కేసీఆర్‌ గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.

    ఆ పార్టీలు మాదిగ విరోధులు: ప్రధాని

    భారాస, కాంగ్రెస్‌ పార్టీలు.. మాదిగ విరోధులని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో నిర్వహించిన ఎస్సీ ఉపకులాల విశ్వరూప మహాసభకు ప్రధాని మోదీ హాజరై మాట్లాడారు. ‘ఎంతో ప్రేమతో నన్ను ఈ సభకు ఆహ్వానించారు. మందకృష్ణ నా చిన్న తమ్ముడు. అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేయాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది. సామాజిక న్యాయానికి మేం కట్టుబడి ఉన్నాం. 3 దశాబ్దాల మాదిగల ఉద్యమానికి నా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నా’ అని అన్నారు.

    ‘కాంగ్రెస్‌ వస్తే మళ్లీ కరెంటు కష్టాలే’

    TG: హుజురాబాద్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌పై మంత్రి హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌ పాలన వస్తే ప్రతి విషయానికి ఢిల్లీ వెళ్లాల్సిందేనని ఎద్దేవా చేశారు. ‘కర్ణాటక ఉప ముఖ్యమంత్రి తెలంగాణకు వచ్చి ఆ రాష్ట్రంలో 5 గం.ల కరెంటు ఇస్తున్నామని గొప్పగా చెబుతున్నారు. ఇక్కడ 24 గంటల కరెంటు ఇస్తున్నాం. కాంగ్రెస్‌ను నమ్మితే మళ్లీ కరెంటు కష్టాలు తప్పవు. హుజూరాబాద్‌లో భాజపా మూడో స్థానానికి పడిపోయింది. అన్ని సర్వేలలో కూడా భారాస అభ్యర్థి కౌశిక్‌రెడ్డి తొలి స్థానంలో ఉన్నారు’ అని అన్నారు.

    భాజపా నాలుగో జాబితా ప్రకటన

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల నాలుగో జాబితాను భాజపా విడుదల చేసింది. ఇప్పటికే మూడు విడతల్లో అభ్యర్థులను ప్రకటించిన కమలం పార్టీ.. తుది జాబితాను ఖరారు చేసింది. టికెట్‌ ఖరారైన అభ్యర్థులకు భాజపా ముఖ్యనేతలు ఇప్పటికే ఫోన్‌ చేసి సమాచారమందించారు. కంటోన్మెంట్‌-కృష్ణ ప్రసాద్‌, నాంపల్లి-రాహుల్‌ చంద్ర, శేరిలింగంపల్లి-రవికుమార్‌ యాదవ్‌, మల్కాజ్‌గిరి-రామచందర్‌రావు, పెద్దపల్లి-ప్రదీప్ కుమార్, మేడ్చల్-విక్రమ్ రెడ్డికి కేటాయించినట్టు భాజపా ఓ ప్రకటనలో తెలిపింది.

    కేసీఆర్‌ ఆస్తుల విలువ ఎంతంటే?

    TG: సీఎం కేసీఆర్ తన పేరిట రూ.58.7 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. రూ. 35.42 కోట్ల విలువైన చరాస్తులు (నగదు, బ్యాంకు డిపాజిట్లు, పెట్టుబడులు), రూ.23.50 కోట్ల విలువైన స్థిరాస్తులు (ఇళ్లు, ఫాంహౌస్‌, ప్లాట్లు) ఉన్నాయని ప్రకటించారు. తన పేరిట సొంత భూమి, కార్లు, బైక్‌, ఇతర వాహనాలు లేవని పేర్కొన్నారు. తన పేరు మీద రూ.17.27 కోట్ల అప్పు, కుటుంబం పేరు మీద రూ.7.23 కోట్ల అప్పు ఉందని అఫిడవిట్లో వెల్లడించారు. సంవత్సర ఆదాయం రూ.1.60 కోట్లు అని … Read more

    కేసీఅర్‌ను ఇంటికి పంపాలి: మోదీ

    తెలంగాణలో భాజపా అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. మీ అందరి ఆశీర్వాదంతోనే ప్రధాని అయ్యానని బీసీ ఆత్మగౌరవ సభలో అన్నారు. ‘తెలంగాణ ప్రజలు భాజపాపైనే విశ్వాసంతో ఉన్నారు. రాష్ట్రంలో తొమ్మిదేళ్లుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ విరోధి అధికారంలో ఉన్నారు. ఆయన్ని ఇంటికి పంపాల్సిన అవసరం ఉంది. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం వచ్చింది. వాటితోనే భారాస మోసం చేసింది. బీసీల ఆకాంక్షలను పట్టించుకునేది భాజపా మాత్రమే’ అని మోదీ అన్నారు.

    సీఎం కేసీఆర్‌కు పవన్‌ చురకలు

    TG: సకల జనులు సమరం చేస్తేనే తెలంగాణ వచ్చిందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన భాజపా బీసీ ఆత్మగౌరవ సభలో ఆయన ప్రసంగించారు. ‘తెలంగాణ సాధించినా నీళ్లు, నిధులు, నియామకాలు అందరికీ అందని పరిస్థితి ఉంది. ప్రధాని మోదీ ఎన్నికలనే దృష్టిలో పెట్టుకొని ఉంటే ఆర్టికల్‌ 370ని రద్దు చేసేవారు కాదు. ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకునేవారు కాదు. నాలాంటి కోట్ల మంది కన్న కలలకు ప్రతిరూపమే మోదీ’ అని పవన్‌ అన్నారు.

    డబ్బుకు ఓటు అమ్ముకోవద్దు: కేసీఆర్‌

    TG: డబ్బుకు ఓటు అమ్ముకోవద్దని భారాస అధినేత కేసీఆర్‌ ప్రజలకు సూచించారు. చెన్నూరు సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘ప్రజాస్వామ్య ప్రక్రియలో ఇంకా పరిణతి రావాలి. ఎన్నికల వేళ ప్రజలు విచక్షణతో ఓటు వేయాలి. ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం. మనం వేసే ఓటే మన భవిష్యత్తు.. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుంది. తెలంగాణ రాకముందు.. వచ్చాక.. రాష్ట్రంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. వాటిని ప్రజలు గమనించాలి.. ఆలోచించాలి. ఆ తర్వాతనే ఓటు వేయాలి’ అని కేసీఆర్‌ ప్రజలను కోరారు.

    ప్రజాశాంతి పార్టీ తొలి జాబితా విడుదల

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ప్రజాశాంతి పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. 12 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల చేశారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు 344 మంది టికెట్ కావాలని అప్లికేషన్‌ పెట్టుకున్నారని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ తెలిపారు. రేపు రెండో జాబితా విడుదల చేస్తామని తెలిపారు. రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి పోటీ చేయనున్నట్లు కేఏ పాల్‌ వెల్లడించారు.

    ఆ ఇద్దరే తెలంగాణ ద్రోహులు: షర్మిల

    సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లపై వైఎస్సార్‌టీపీఅధ్యక్షురాలు షర్మిల ఫైరయ్యారు. అభివృద్ధిపై చర్చించే దమ్ము, ధైర్యం లేక ఇంకా తెలంగాణ సెంటిమెంట్‌ను వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్, కేటీఆర్‌లకు మించిన తెలంగాణ ద్రోహులు ఇంకెవ్వరూ ఉండరని విమర్శించారు. ప్రజలు నమ్మి రెండు సార్లు అధికారమిస్తే రాష్ట్ర సంపదను దోచుకున్నారని ఆరోపించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తా మని హామీనిచ్చి 10 ఏళ్లలో రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయారని షర్మిల విమర్శించారు.