• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బాలయ్య మూవీపై చిరంజీవిదే పైచేయి

    సంక్రాంతి పండగ దగ్గరపడుతుండటంతో చిరు, బాలయ్య అభిమానులు ఎంతో ఎగ్జైట్‌మెంట్‌కు లోనవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ అగ్ర హీరోల ట్రైలర్లు అభిమానుల్లో సినిమాలపై అంచనాలను పెంచాయి. అయితే ట్రైలర్ వ్యూస్, లైక్స్ పరంగా వీరసింహారెడ్డి మూవీ కంటే వాల్తేరు వీరయ్య కాస్త ముందుంది. వీర సింహా రెడ్డి ట్రైల‌ర్‌కు 24 గంట‌ల్లో 8మిలియన్స్‌కు పైగా వ్యూస్ రాగా 3.82లక్షల లైక్స్ వ‌చ్చాయి. వాల్తేరు వీర‌య్య ట్రైల‌ర్ విడుద‌లైన 24 గంట‌ల్లో 11.77 మిలియ‌న్స్ వ్యూస్ సాధించింది మరో 4.71లక్షల లైక్స్ సాధించింది.ట్రైలర్ రికార్డులు పక్కన … Read more

    ట్రెండింగులో ‘వీరసింహారెడ్డి’ ట్రైలర్

    బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. విడుదలైన 20 గంటల్లోనే 6.1 మిలియన్‌కు పైగా వ్యూస్‌ని దక్కించుకుని ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. లక్షల్లో లైక్స్‌ని సంపాదిస్తోంది. బాలయ్య మాస్ డైలాగులు, ఎలివేషన్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఏపీ రాజకీయాలను కూడా డైలాగుల ద్వారా పరోక్షంగా ప్రస్తావించడం, రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కడంతో అభిమానులు మరింత ఆసక్తిని కనబరుస్తున్నారు. ట్రైలర్‌ని చూస్తుంటే సమరసింహారెడ్డి, నరసింహనాయుడు సినిమాలు గుర్తుకొస్తున్నాయని కామెంట్లు పెడుతున్నారు.

    నేను అందరివాడిని; నందమూరి బాలకృష్ణ

    తాను రాయలసీమకే పరిమితమవుతానని అందరూ అనుకుంటారని.. కానీ నేను అందరివాడినని నందమూరి బాలకృష్ణ అన్నారు. ఒంగోలులో జరిగిన ‘వీరసింహారెడ్డి’ ప్రి రిలీజ్ ఈవెంట్ వేడుకలో బాలకృష్ణ మాట్లాడుతూ ‘‘ ఒంగోలు గిత్త గోపీచంద్ అద్భుత దర్శకుడు. నటులు, టెక్నీషియన్ల నుంచి టాలెంట్ వెలికితీసే సత్తా అతనికి ఉంది. నా తర్వాతి సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడిది కూడా ఒంగోలే. నాకు జన్మనిచ్చి, మీ అందరి గుండెల్లో స్థానం కల్పించినందుకు ఎన్టీఆర్‌కు ధన్యవాదాలు.’’ అంటూ పేర్కొన్నారు.

    సూపర్.. ట్రైలర్ అదిరింది

    బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ ట్రైలర్ విడుదలైంది. ‘తనది ఫ్యాక్షన్ కాదు.. సీమపై ఎఫెక్షన్’ వంటి మాస్ డైలాగులతో ట్రైలర్ హోరెత్తిపోతోంది. ఒక్క ట్రైలర్‌లో ఎన్నో డైలాగులను ఇమిడ్చి సినిమాపై అంచనాలు పెంచేశారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. శ్రుతిహాసన్ కథానాయికగా నటించగా.. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటించింది.

    సంప్రదాయ చీరలో శ్రుతిహాసన్

    ‘వీరసింహారెడ్డి’ ప్రీ రిలీజ్ వేడుకలో హీరోయిన్ శ్రుతిహాసన్ సంప్రదాయ వస్త్రధారణతో ఆకట్టుకుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగడానికి ముందు ట్రెడిషనల్ బ్లాక్ చీరలో కనిపిస్తూ శ్రుతి వయ్యారాలు వలకబోసింది. ఈ వీడియోను శ్రుతిహాసన్ తన ఇన్‌స్టా ఖాతా ద్వారా పంచుకుంది. దీంతో ట్రెడిషనల్ ట్రెండీ లుక్‌లో శ్రుతి అదరగొట్టిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ఒంగోలులో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించగా.. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. https://www.instagram.com/reel/CnEWB9-BSdQ/?utm_source=ig_web_copy_link Screengrab … Read more

    ‘వీరసింహారెడ్డి’ ప్రీరిలీజ్ వేడుకకు అనుమతి నిరాకరణ

    నటసింహం బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. ఈ నెల 6న ఒంగోలులో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించడానికి చిత్రబృందం ఏర్పాట్లు చేస్తుండగా.. పోలీసులు అనుమతి నిరాకరించారు. ఏబీఎం కళాశాల మైదానం ఈ వేడుకకు వేదిక కావడంతో అభిమానుల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశముందని భావించి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఈవెంట్‌ని ఎక్కడ నిర్వహించాలనే విషయంపై చిత్ర నిర్మాతలు సందిగ్ధంలో పడ్డట్లు తెలుస్తోంది. ఇటీవల టీడీపీ సభల్లో పలువురు మరణించిన సంగతి తెలిసిందే. His Mass Craze … Read more

    ఊపేస్తున్న వీరసింహారెడ్డి ఐటెమ్ సాంగ్

    బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ‘వీరసింహారెడ్డి’ సినిమా నుంచి మరో పాట విడుదలైంది. ‘మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయె’ అంటూ సాగుతున్న ఐటమ్ సాంగ్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు లిరిక్స్ అందించగా.. తమన్ స్వరాలను సమకూర్చారు. సాహితీ, సత్య యామిని, రేణు కుమార్ కలిసి పాటను ఆలపించారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. జనవరి 12న విడుదల కానుంది.