• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మందు కొడుతున్న ధోనీ: వీడియో వైరల్

    భారత క్రికెట్ దిగ్గజం మహేంద్రసింగ్ ధోనికి సంబంధించిన ఓ పాత వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో ధోని తన స్నేహితులతో కలసి మద్యం తాగుతుండడం విశేషం. ధోని కెరీర్ ఆరంభంలో ఈ వీడియో తీసినట్లుగా కనిపిస్తోంది. ఈ వీడియోలో మద్యం తాగుతూ.. ఫోన్ మాట్లాడుతూ ధోని కనిపించాడు. తన స్నేహితులు కూడా వైన్ సేవిస్తున్నారు. ఓ చిన్న గదిలో కింద కూర్చుని సాదాసీదాగా మహీ ఉన్నాడు. ఇది ఎక్కడ జరిగిందనేది క్లారిటీ లేదు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. … Read more

    నాకు ప్రెగ్నెంట్ కావాలనుంది: హీరోయిన్

    తనకు ప్రెగ్నెంట్ కావాలని ఉందని బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ పేర్కొంది. ‘‘ప్రెగ్నెంట్ సమయంలో నాకు నచ్చింది తినవచ్చు. అడ్డు చెప్పేవారే ఉండరు. నాకు పుట్టబోయే బిడ్డ ఎవరైనా ఒకటే. ఆడ, మగ ఎవరైనా ఆరోగ్యంగా ఉంటే చాలు.’’ అంటూ చెప్పుకొచ్చింది. కియారా తన ప్రియుడు, బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లి చేసుకుంది. కాగా కియారా ప్రస్తుతం రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘గేమ్‌ఛేంజర్’ చిత్రంలో నటిస్తోంది.

    పవన్‌ తొలి పోస్టు వైరల్‌

    పవర్‌ స్టార్ పవన్‌ కల్యాణ్ తన ఇన్‌స్టాలో తొలి పోస్ట్‌ పెట్టారు. సినీ కెరీర్‌కు సంబంధించిన ఓ ప్రత్యేక వీడియోను షేర్‌ చేశారు. చిత్ర పరిశ్రమలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు సినీ ప్రముఖులతో దిగిన ఫొటోలను అందులో పంచుకున్నారు. చలనచిత్ర పరిశ్రమలో భాగమై ఎంతోమంది ప్రతిభావంతులతో ప్రయాణిస్తున్నందుకు కృతజ్ఞతతో ఉన్నానని వీడియో ప్రారంభంలో పవన్‌ అన్నారు. ఇక ఈ వీడియోను అభిమానులు, సెలబ్రిటీలు తెగ షేర్‌ చేస్తున్నారు. https://www.instagram.com/reel/Cut9Fehp89Z/?utm_source=ig_web_copy_link&igshid=MzRlODBiNWFlZA==

    మిత్రుడ్ని చూసి డ్యాన్స్‌ చేసిన కొంగ

    యూపీలోని కాన్పుర్‌ జూలో ఉన్న ఓ కొంగ పాత మిత్రుడ్ని చూసి ఊగిపోయింది. సంతోషంతో డ్యాన్స్‌ చేసింది. అమేఠీకి చెందిన ఆరిఫ్‌ ఏడాది కిందట తీవ్రంగా గాయపడిన ఈ సారస్‌ కొంగను కాపాడి ప్రేమగా చూసుకున్నాడు. అప్పట్లో వీరి స్నేహం వైరల్‌తో కావడంతో జూ అధికారులు కొంగను తీసుకెళ్లిపోయారు. చాలా రోజుల చూసేందుకు వెళ్లిన ఆరీఫ్‌ను కొంగ గుర్తుపట్టింది. అతని దగ్గరకు వెళ్లేందుకు తహతహలాడింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్‌ ‌అవుతోంది. #Kanpur: when Arif met his friend Saras … Read more

    ఇదేం దొంగతనం రా నాయనా?

    గుంటూరులో ఓ వ్యక్తి రూ.20లకు కక్కుర్తి పడి రూ.10 లక్షలు పోగొట్టుకున్నాడు. దొంగలు ఎంతో తెలివితో రూ.10 లక్షలు కొట్టేసిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. నగరంలోని లక్ష్మీపురంలో ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఓ మిర్చి వ్యాపారి రూ.10 లక్షలు విత్‌డ్రా చేశారు. అనంతరం బైక్‌ హ్యాండిల్‌కు తగిలించి స్టార్ట్ చేస్తుండగా ఓ వ్యక్తి వచ్చి మీ డబ్బులు కిందపడిపోయాయని చెప్పారు. దీంతో రూ.20లను తీసుకుంటుండగా మరో వ్యక్తి వచ్చి హ్యాండిల్‌కు ఉన్న రూ.10 లక్షల సంచి ఎత్తుకెళ్లాడు. Guntur : సినీ పక్కీలో … Read more

    VAISHNAVI CHAITANYA: తెలుగింటి అందానికి ఫిదా

    కుర్ర హీరోయిన్ వైష్ణవీ చైతన్య ఫొటోలు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ఎందుకంటే ఆమె నటించిన ‘బేబీ’ చిత్రం జులై 14న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందంతో కలిసి ఈ చిన్నది ప్రమోషన్స్‌​లో బిజీ బీజీగా గడుపుతోంది. దీంతో వైష్ణవి పాప ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకు ఈ ముద్దుగుమ్మ బ్యాక్‌గ్రౌండ్ ఏంటో YouSay Webపై క్లిక్ చేసి తెలుసుకోండి. .

    ఆవు కోసం సింహానికే ఎదురెళ్లాడు

    తన ఆవును రక్షించుకోవడానికి ఓ రైతు సింహానికే ఎదురెళ్లాడు. ఈ ఘటన గుజరాత్‌లోని గిర్ సోమ్‌నాథ్ జిల్లా అలీదార్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఓ రైతు తన ఆవును మేపుతుండగా సింహం వచ్చి దాడి చేసింది. ఆవు గొంతును సింహం పట్టుకుని కొరుకుతుండగా విలవిల్లాడిపోయింది. దీంతో రైతు ఆవును ఎలాగైనా కాపాడుకోవాలని పెద్దగా అరుస్తూ సింహానికి ఎదురెళ్లాడు. రాయి తీసుకుని సింహంపై విసరగా అది పారిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ગીર સોમનાથ જિલ્લાના આલીદર ગામે સિંહણ દ્વારા ગાય … Read more

    GUNTURKARAM: పూజా హెగ్డే స్థానంలో మీనాక్షి చౌదరి!

    సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం’ మూవీ గురించి ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ సినిమాలో పూజా హెగ్డేకు బదులు మీనాక్షి చౌదరిని హీరోయిన్‌గా తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ హర్యానా బ్యూటీ ఇంతకుముందు ‘ఇచ్చట వాహనములు నిలపరాదు’, ‘హిట్2’ సినిమాల్లో నటించి మెప్పించింది. కాగా ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తోంది. ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ డైరెక్షన్ చేస్తున్నారు. హారికా హాసినీ క్రియేషన్స్ సంస్థ తెరకెక్కిస్తోంది.

    మరోసారి ఆస్పత్రి పాలైన నటి ఖుష్భూ

    సీనియర్ నటి ఖుష్బూ మరోసారి ఆస్పత్రి పాలైంది. ఈ మేరకు ఆమె స్వయంగా సోషల్ మీడియాలో ఓ ఫొటో పెట్టి పోస్ట్ చేసింది. టైల్ బోన్ చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ట్రీట్‌మెంట్ తీసుకుని కోలుకుంటున్నా. సమస్య త్వరలోనే నయమవుతుంది.’’ అంటూ పేర్కొంది. కాగా ఇంతకుముందు కూడా గత ఏప్రిల్‌లో ఆమె అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. మళ్లీ ఇప్పుడు ఆమె ఆస్పత్రి పాలైంది. ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

    నన్ను వదిలేయండి ప్లీజ్: అనసూయ

    తనకు ఓ ఫ్యామిలీ ఉందని.. ఇకపై వివాదాల్లోకి లాగకుండా వదిలేయాలని యాంకర్ అనసూయ మొరపెట్టుకుంది. అనసూయ చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ‘‘కొద్ది రోజులుగా సినీ, రాజకీయ పరిశ్రమలో ఇతరులను అగౌరవ పరిచేందుకు నా పేరు వాడుకుంటున్నారు. ఇది నన్ను కించపరిచేదిగా.. అమర్యాదగా ఉంది. వీటితో నాకెలాంటి సంబంధం లేదు. ఇది నా జీవితం.. నాకు నచ్చిన విధంగా ఉంటా. అనవసర విషయాల్లోకి నా పేరును లాగకండి. ప్లీజ్’’ అంటూ అనసూయ పేర్కొంది.