నేడు దివంగత ప్రధాని పీవీ నరసింహరావు జయంతి. పీవీ పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసిహరావు. ఆయన జూన్ 28, 1921న తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాలోని లక్నేపల్లి గ్రామంలో జన్మించాడు. 1938 లోనే హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెసు పార్టీలో చేరాడు. 1951లో అఖిల భారత కాంగ్రెసు కమిటీలో సభ్యుడిగా స్థానం పొందాడు. 1957 లో మంథని నియోజక వర్గం నుంచి శాసనసభకు ఎన్నికవడం ద్వార రాష్ట్రస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. 1962 లో మొదటిసారి మంత్రి అయ్యాడు. 1971లో ముఖ్యమంత్రి అయ్యాడు. ఇక 1991 సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేయలేదు. కానీ ఆ సమయంలో రాజీవ్ గాంధీ హత్య కారణంగా కాంగ్రెసు పార్టీ పీవీని ప్రధాని చేసింది. ప్రధాని అయిన తర్వాత పీవీ ఆర్థికవ్యవస్థకు పునరుజ్జీవం కల్పించేందుకు కొత్త సంస్కరణలకు బీజం వేసాడు. ఆ సంస్కరణలతోనే తర్వాత కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ అద్భుతమైన అభివృద్ధిని సాదించింది. అందుకే పీవీని ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేర్కొంటారు.