సెమీస్ వంటి మ్యాచుల్లో ఒత్తిడి సహజం: రోహిత్
నిన్న న్యూజిలాండ్తో విజయం తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మ్యాచ్పై స్పందించాడు. వాంఖడే మైదానంలో చాలా మ్యాచ్లు ఆడామని చెప్పారు. అలాగని రిలాక్స్గా ఉండకూడదన్నారు. ‘వీలైనంత త్వరగా బాధ్యతలను ముగించాలి. సెమీస్ వంటి మ్యాచుల్లో ఒత్తిడి సహజం. లక్ష్య ఛేదనలో రన్రేట్ 9కి కంటే ఎక్కువగా ఉందో.. అప్పుడు విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. నిన్నటి మ్యాచ్లో షమీ అద్భుతం చేశాడు. అతడి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది’. అని రోహిత్ చెప్పుకొచ్చాడు.