• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • టీమిండియా చీఫ్ సెలెక్టర్‌ అజిత్ అగార్కర్‌.. చెత్త రికార్డు తెలుసా?
    MS DHONI AI IMAGES: దశవతరాల్లో ధోనీని చూశారా.. నిజంగా థ్రిల్ అవుతారు!
    ICC Tourneys: వచ్చే 8 ఏళ్లలో 10 ఐసీసీ టోర్నీలు.. ఆతిథ్య దేశాలు ఇవే!
    Virat Kohli AI: విరాట్ దశావతారం.. ఎంతైనా కింగ్ కింగే..!
    See More

    సెమీస్‌ వంటి మ్యాచుల్లో ఒత్తిడి సహజం: రోహిత్

    నిన్న న్యూజిలాండ్‌తో విజయం తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మ్యాచ్‌‌పై స్పందించాడు. వాంఖడే మైదానంలో చాలా మ్యాచ్‌లు ఆడామని చెప్పారు. అలాగని రిలాక్స్‌గా ఉండకూడదన్నారు. ‘వీలైనంత త్వరగా బాధ్యతలను ముగించాలి. సెమీస్‌ వంటి మ్యాచుల్లో ఒత్తిడి సహజం. లక్ష్య ఛేదనలో రన్‌రేట్‌ 9కి కంటే ఎక్కువగా ఉందో.. అప్పుడు విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. నిన్నటి మ్యాచ్‌లో షమీ అద్భుతం చేశాడు. అతడి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది’. అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

    నేడు భారత్-న్యూజిలాండ్ మ్యాచ్

    వన్డే వరల్డ్ కప్ భాగంగా నేడు న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది. వాంఖడే స్టేడియం వేదికగా ఈ హైహోల్టేజ్ మ్యాచ్ జరుగుతోంది. 2019 వరల్డ్ కప్ సెమీస్ లో ఓటమి పాలైన టీమిండియాకు నాలుగేళ్ల తర్వాత న్యూజిలాండ్ పై ప్రతీకారం తీర్చుకునే ఛాన్స్ దక్కింది. తొలి సెమీ ఫైనల్‌కు చేరుకున్న టీమిండియా మరో గెలుపు కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

    ‘వీళ్లకంటే రోహిత్‌ ప్రత్యేకం’

    టీమిండియా సారథి రోహిత్‌ శర్మపై మాజీ క్రికెటర్లు సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. పాక్‌ దిగ్గజాలు వసీమ్‌ అక్రమ్‌, షోయబ్‌ మాలిక్‌ కూడా హిట్‌మ్యాన్‌ను పొగడ్తల్లో ముంచెత్తారు. ‘ప్రపంచ క్రికెట్‌లో ఎంతో మంది గొప్ప ఆటగాళ్లు ఉన్నారు. రోహిత్‌ శర్మ వారందరికంటే ప్రత్యేకం. ఏ బౌలర్నీ అతడు వదిలిపెట్టలేదు. ప్రత్యర్థి ఎవరైనా కానీ.. ఎలాంటి బౌలింగ్‌ దాడైనా కానీ.. వారిని దీటుగా ఎదుర్కొంటూ చాలా తేలికగా పరుగులు రాబడతాడు’. అని పాక్ క్రికెటర్లు కొనియాడారు.

    భారత్‌-ఆస్ట్రేలియా టీ-20 టికెట్ల విక్రయాలు

    భారత్‌-ఆస్ట్రేలియా టీ-20 మ్యాచ్‌ టికెట్ల విక్రయాలు రేపటి నుంచి ప్రారంభంకానున్నాయి. విశాఖలో ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ స్టేడియంలో ఈనెల 23న ఆసీస్ భారత్‌తో తలపడనుంది. ఈనేపథ్యంలో 15, 16 తేదీల్లో ఆన్‌లైన్‌లో ఉదయం 11 గంటల టికెట్ల విక్రయాలు ప్రారంభం కానున్నాయి. రూ.600, రూ.1500, రూ.2,000, రూ.3,000, రూ.3,500, రూ.6,000 ధరల్లో టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి.

    IND Vs NZ సెమీస్‌.. ఆ నగరాల్లో భారీ స్క్రీన్లు

    ప్రపంచకప్‌లో భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య రేపు సెమీస్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో అభిమానులు వీక్షించేందుకు ఏపీలో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నారు. ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో విశాఖపట్నం, విజయవాడ, కడప నగరాల్లో ఈ స్క్రీన్లు ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు మధ్యాహ్నం 1.30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మ్యాచ్‌ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. విజయవాడలోని మున్సిపల్‌ స్టేడియం, కడపలోని ఆర్ట్స్‌ కాలేజీ మైదానంలో భారీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు.

    బంగ్లాదేశ్‌పై ఆసీస్‌ ఘన విజయం

    ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 306-8 స్కోరు చేసింది. ఈ భారీ లక్ష్యాన్ని ఆసీస్ రెండే వికెట్లు కోల్పోయి 44.4 ఓవర్లలోనే ఛేదించింది. మిచెల్ మార్ష్‌ (177*; 132 బంతుల్లో 17 ఫోర్లు, 9 సిక్స్‌లు) విధ్వంసం సృష్టించాడు. 87 బంతుల్లోనే శతకం నమోదు చేశాడు. అటు స్టీవ్ స్మిత్ (63*), వార్నర్ (53) అర్ధ శతకాలు బాదారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్‌, … Read more

    ENG vs PAK: ఇంగ్లాండ్‌ భారీ స్కోరు

    పాకిస్థాన్‌తో జరుగుతున్న ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. సాంకేతికంగా మాత్రమే రేసులో ఉన్న పాక్.. ఈ భారీ లక్ష్యాన్ని 6.2 ఓవర్లలో ఛేదిస్తే నాకౌట్‌కు చేరుతుంది. కానీ, ఇది జరగడం అసాధ్యం. ఇంగ్లాండ్ బ్యాటర్లలో బెన్‌ స్టోక్ (84), జో రూట్ (60), బెయిర్‌ స్టో (59), మలన్ (31), బట్లర్ (27), బ్రూక్ (30) రాణించారు. పాక్ బౌలర్లలో హారిస్ రవూఫ్‌ 3, షాహీన్ అఫ్రిది … Read more

    ENG vs PAK: పాకిస్థాన్ సెమీస్‌కు చేరాలంటే?

    వన్డే ప్రపంచకప్‌ భాగంగా పాకిస్థాన్‌‌తో ఇంగ్లాండ్‌తో తలపడుతోంది. టాస్‌ నెగ్గిన ఇంగ్లాండ్‌ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ నేపథ్యంలో పాక్‌కు సెమీస్‌కు చేరాలంటే ఇంగ్లాండ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయాలి. అలాగే మరింత వేగంగా లక్ష్యఛేదన చేయాల్సి ఉంటుంది. ఇంగ్లాండ్ ఒక వేళ 50 పరుగులు చేస్తే.. పాక్‌ 2 ఓవర్లలో లక్ష్యఛేదన చేయాలి. ఇంగ్లాండ్ 200 పరుగులు చేస్తే.. పాక్ 4.3 ఓవర్లలో విజయం సాధించాల్సి ఉంటుంది.

    AUS vs BAN: ఆసీస్ ముందు భారీ లక్ష్యం

    ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌ తలపడుతున్నాయి. మ్యాచ్‌‌లో ఆసీస్ టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టాపోయి 306 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్లు తౌహిద్‌ హృదౌయ్‌ (74), నజ్ముల్ హొస్సేన్ శాంటో (45), తాంజిద్ హసన్ (36), లిట్టన్ దాస్ (36), మహ్మదుల్లా (32), మెహదీ హసన్ మిరాజ్ (29), ముష్పీకర్ రహీమ్ (21) పరుగులతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా 2, సీన్ అబాట్ 2, మార్కస్ స్టాయినిస్ … Read more

    శ్రీలంకకు ఐసీసీ షాక్

    శ్రీలంకకు ICC షాక్‌ ఇచ్చింది. ఆ దేశ క్రికెట్‌ సభ్యత్వాన్ని సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు ఐసీసీ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఒక సభ్య దేశంగా శ్రీలంక తన బాధ్యతలను ఉల్లంఘించిందని ఐసీసీ పేర్కొంది. శ్రీలంక క్రికెట్‌ స్వయం ప్రతిపత్తితో వ్యవహరించలేకపోతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. శ్రీలంక క్రికెట్‌ బోర్డులో ప్రభుత్వ జోక్యం చేసుకోవడంపై ఐసీసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. సస్పెండ్ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది.