నిరుద్యోగం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఆరికట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. పంజాబ్ -అమృత్ సర్ లో నిర్వహించిన ఆందోళన హింసాత్మకంగా మారింది. పీసీసీ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా నేతృత్వంలో పంజాబ్ కాంగ్రెస్ భారీ ర్యాలీ చేపట్టింది.ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకోగా… ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.కాంగ్రెస్ కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు పెద్దఎత్తున వాటర్ క్యాన్లను ప్రయోగించారు. లాఠీ ఛార్జ్ చేశారు. ఈ ఘనటలో పలువురు కాంగ్రెస్ నేతలు గాయపడ్డారు.
![](https://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2022/08/05175733/image-571.jpeg)