• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేడు అథ్లెట్లతో ప్రధాని మోదీ భేటీ

    ఏషియన్‌ గేమ్స్‌ అథ్లెట్లతో నేడు ప్రధాని మోదీ భేటీ కానున్నారు. మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో ఏషియన్ గేమ్స్‌లో పాల్గొన్న భారతీయ అథ్లెట్ల బృందంతో మోదీ సంభాషించనున్నారు. అటు ఏషియన్ గేమ్స్‌లో భారత్ చరిత్ర సృష్టించింది. ఈ గేమ్స్‌లో 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్య పతకాలతో పతకాల పట్టికలో నాల్గో స్థానంలో నిలిచింది.

    ఘనంగా ముగిసిన ఏసియన్ గేమ్స్

    ఏసియన్ గేమ్స్ ముగింపు వేడుకలను చైనా అద్భుతంగా నిర్వహించింది. హాంగ్‌జౌ ఒలింపిక్ క్రీడా కేంద్రం స్టేడియంలో ఈ వేడుకలు జరిగాయి. ప్రేక్షకులను రంగుల ప్రపంచంలోకి తీసుకెళ్లి మంత్రముగ్ధులను చేశారు. ఇండియన్ ఫ్లాగ్ బేరర్‌గా హాకీ ప్లేయర్ శ్రీజేష్ వ్యవహరించాడు. ఈ క్రీడల్లో 45 దేశాల నుంచి 12,407 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఏసియన్ గేమ్స్‌లో చైనా అత్యధికంగా 383 పతకాలు సాధించగా, భారత్ 107 పతకాలతో నాలుగవ స్థానంలో నిలిచింది.

    ఏసియన్ గేమ్స్‌లో భారత్ రికార్డ్

    ఏసియన్ గేమ్స్‌లో ఈ సారి వంద పతకాలు సాధించి భారత్ రికార్డ్ సృష్టించింది. మన క్రీడాకారులు స్వర్ణం-25, రజతం-35, కాంస్యం-40 పతకాలు సాధించారు. ఆర్చరీ మహిళల విభాగంలో తెలుగమ్మాయి జ్యోతి సురేఖ గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. ప్రస్తుతం ఏసియన్ గేమ్స్‌ పతకాల విషయంలో భారత్ 4వ స్థానంలో కొనసాగుతోంది.

    ధోని నుంచి అవి నేర్చుకోవాలి: గైక్వాడ్

    ఆసియా క్రీడల్లో భారత జట్టుకు రుత్‌రాజ్‌ గైక్వాడ్‌ సారథ్యం వహిస్తున్నాడు. తొలి మ్యాచ్ రేపు నేపాల్‌తో జరగనుంది. ఈ నేపథ్యంలో గైక్వాడ్‌ స్పందించాడు. ‘ధోనీ నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నా. ఆయన స్టైల్‌, ఆయన వ్యక్తిత్వం విభిన్నం. పరిస్థితులను ఎలా హ్యాండిల్ చేయాలి? మ్యాచ్‌ సమయంలో కొందరు ఆటగాళ్లతో ఎలా ప్రవర్తించాలి? వంటివి ఆయన నుంచి నేర్చుకోవాలి. అయితే, నా స్టైల్‌లోనే కెప్టెన్సీని నిర్వర్తించాలని కోరుకుంటున్నా. ఆటగాళ్లు తమ అత్యుత్తమ ప్రదర్శనను ఇచ్చేలా వారికి పూర్తి స్వేచ్ఛనిస్తా’ అని గైక్వాడ్‌ చెప్పాడు.

    గోల్డ్ మెడలే లక్ష్యం: రుతురాజ్

    ఆసియా క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించి పోడియం వద్ద జాతీయ గీతాన్ని ఆలపించడమే తన లక్ష్యమని రుతురాజ్ గైక్వాడ్ వెల్లడించాడు. భారత్ క్రికెట్ జట్టుకు రుతురాజ్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. టీ20 ఫార్మాట్‌లో జరిగే ఈ క్రీడలకు జట్టు చైనా వెళ్లనుంది. ఈ మేరకు కుర్రాళ్లతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు క్రీడలు జరగనున్నాయి. మరోవైపు, సెప్టెంబర్ 28 నుంచే వరల్డ్ కప్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ కూడా ఇందులో ఉన్నాడు. … Read more