• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఇవాళ ముదినపల్లే నుంచి వారాహి యాత్ర

    నేడు విజయవాడ- ముదినేపల్లిలో పవన్ కల్యాణ్‌ వారాహి యాత్ర కొనసాగనుంది. మచిలీపట్నం నుంచి సాయంత్రం 5 గంటలకు ముదినేపల్లికి పవన్ చేరుకోనున్నారు. ముదినేపల్లిలో బహిరంగసభలో ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. వారాహి యాత్రలో వైసీపీ ప్రభుత్వంపై పవన్ మాటల దాడి పెంచారు. 32 కేసులున్న జగన్ అవినీతిపై నీతులు చెబుతున్నారని విమర్శించారు. సమస్యలపై గళం విప్పిన నేతలను జైలుకు పంపించి జగన్ సైకోలాగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

    పవన్ కళ్యాణ్‌కు పోలీసుల నోటీసులు

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు మచిలిపట్నం పోలీసులు నోటీసులు జారీ చేశారు. వారాహి యాత్రలో కొంత మంది క్రిమినల్స్, అసాంఘిక శక్తులు రాళ్లదాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న వ్యాఖ్యలపై ఆధారాలు సమర్పించాలని నోటీసుల్లో కోరారు. ఈ వ్యాఖ్యలపై ఎస్పీ జాషువా స్పందిస్తూ.. ఆధారాలు లేకుండా మాట్లాడటం మంచిదికాదు. విద్వేషాలు రెచ్చగొట్టెలా వ్యాఖ్యలు చేస్తే పర్యవసనాలు ఉంటాయి. మా సమాచార వ్యవస్థ మాకుంది. ఆయన దగ్గర ఏమైన ఆధారాలు ఉంటే మాకు ఇవ్వాలి’ అని సూచించారు.

    సీఎం జగన్‌ హామీలు మరిచారు: పవన్

    వైఎస్ జగన్ తన పాదయాత్రలో ఇష్టానుసారంగా హామీలు చేసి వాటిని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. సీఎం జగన్ తప్పుడు నిర్ణయాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. స్మార్ట్ మీటర్లతో రైతులకు భారమని తెలిపారు. జనసేన-టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. అందరికీ న్యాయం జరిగే బాధ్యతను జనసేన తీసుకుంటుందని చెప్పుకొచ్చారు.

    పోసానిపై కేసు పెట్టాలని హైకోర్టు ఆదేశం

    నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళిపై కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఇటీవల ఆయన పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై జనసేన నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేయలేదు. దీంతో హైకోర్టును ఆశ్రయించగా కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో రాజమండ్రి పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద పోసానిపై కేసు నమోదు చేశారు.

    ఏపీలో జనసేన బలం పెరిగింది: పవన్‌

    AP: మచిలీపట్నంలో జరిగిన వారాహి యాత్రలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జనసేన బలం 14% నుంచి 18% పెరిగిందని పేర్కొన్నారు. అంచలంచెలుగా అధికారంలోకి రాగలం తప్ప ఒకేసారి గెలవలేమని స్పష్టం చేశారు. ఒంటరిగా వెళితే అధికారంలో వస్తామా? అనేది తనకు సందేహమేనన్నారు. పొత్తుతో వెళితే బలమైన సీట్లు వస్తాయని అంచనా వేశారు. తద్వారా అసెంబ్లీలో బలమైన పాదముద్ర పడుతుందని జోస్యం చెప్పారు. సీఎం అవుతానా? లేదా? అనేది గెలుపు నిష్పత్తిని బట్టి ఉంటుందని పవన్ అన్నారు.

    ఏపీలో జనసేన బలం పెరిగింది: పవన్‌

    AP: మచిలీపట్నంలో జరిగిన వారాహి యాత్రలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జనసేన బలం 14% నుంచి 18% పెరిగిందని పేర్కొన్నారు. అంచలంచెలుగా అధికారంలోకి రాగలం తప్ప ఒకేసారి గెలవలేమని స్పష్టం చేశారు. ఒంటరిగా వెళితే అధికారంలో వస్తామా? అనేది తనకు సందేహమేనన్నారు. పొత్తుతో వెళితే బలమైన సీట్లు వస్తాయని అంచనా వేశారు. తద్వారా అసెంబ్లీలో బలమైన పాదముద్ర పడుతుందని జోస్యం చెప్పారు. సీఎం అవుతానా? లేదా? అనేది గెలుపు నిష్పత్తిని బట్టి ఉంటుందని పవన్ అన్నారు.

    చంద్రబాబు గాడ్సే కంటే ఘోరం: రోజా

    AP: చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లపై మంత్రి రోజా ఫైర్‌ అయ్యారు. ప్రజాసొమ్ము దోచుకున్న వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. బాబు గాడ్సేకంటే ఘోరమైన వ్యక్తి అని మండిపడ్డారు. చంద్రబాబు జీవితమే హింసా మార్గమని విమర్శించారు. అటు 15 సీట్లలో పోటీ చేసేందుకు కూడా జనసేనకు అభ్యర్థులు లేరని దుయ్యబట్టారు. పొత్తు పెట్టుకోకుండా పోటీ చేయలేని పార్టీ టీడీపీదని మండిపడ్డారు. సన్యాసీ, సన్యాసీ కలిస్తే బుడిద రాలుతుందని ఎద్దేవా చేశారు.

    పవన్ పూటకో మాట: అంబటి

    అవినీతిలో మునిగి తేలినవాళ్లు జైళ్లో మహాత్మగాంధీ జయంతి రోజున దీక్షలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ఇలాంటి దీక్షలు చేస్తున్నవారిని చూస్తే మహాత్ముడి ఆత్మ క్షోభిస్తుందని తెలిపారు. పవన్ పూటకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. మొన్నటిదాక బీజేపీతో పొత్తు అని ఇప్పుడు టీడీపీతో మాత్రమే పొత్తు అని అంటున్నారని చురకలు అంటించారు. కేవలం కాపులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే పవన్ సభలు పెడుతున్నారని ఆరోపించారు.

    హరిహరవీరమల్లు ఇప్పట్లో లేనట్లేనా?

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ క్రిష్ కాంబోలో వస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి పవన్ కళ్యాణ్ నవంబర్‌లో కేటాయించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ ఏడాది సమ్మర్ వరకు డేట్స్ కుదరకపోవచ్చని తెలుస్తోంది. కాగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్‌లో AM రత్నం నిర్మిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నిధి అగర్వాల్ నటిస్తున్నారు.

    జనసేన-టీడీపీ కూటమికి మద్దతివ్వండి: పవన్

    ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన-టీడీపీ కూటమికి మద్దతు ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలను కోరారు. నాల్గో విడత వారాహి యాత్రలో ఆయన మాట్లాడుతూ.. ‘స్వయంగా నేను గెలవకున్నా.. నిలబడి పోరాడుతున్నానంటే నా నిబద్ధత ఏంటో అర్థం చేసుకోండి. జనసేన-టీడీపీ కూటమికి మద్దతివ్వండి. మళ్లీ జగనుకు ఓటేస్తే పరుస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. సమస్యలపై మాట్లాడుతోంటే నన్ను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు. అవనిగడ్డ ప్రాంతంలో ఇసుక దోపిడీ వల్ల 76 మంది ప్రాణాలు కొల్పోయారు. ఏపీ భవిష్యత్ కోసం ఈసారి సరైన వ్యక్తులకు … Read more