• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎమోషనల్ అయిన రేణు దేశాయ్

    టైగర్ నాగేశ్వర్‌రావు ప్రీరిలీజ్ ఈవెంట్‌లో రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను ఇండస్ట్రీకి వచ్చి 23 ఏళ్లు పూర్తి కావొస్తోంది. బద్రి మూవీ తర్వాత సినిమాల్లో కనిపించకపోయినా అభిమానుల ప్రేమ మాత్రం తగ్గలేదు. టైగర్ నాగేశ్వర్‌రావు మూవీలో మంచి పాత్ర ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్. రవితేజ గారు తీసుకున్న నిర్ణయం నా జీవితానికి ఎంత ముఖ్యమైనదో ఆయనకు తెలియదు. పర్సనల్‌గా రవితేజగారికి థ్యాంక్స్ అంటూ ఎమోషనల్ అయ్యారు. https://x.com/UttarandhraNow/status/1713634051394093306?s=20

    ‘చంద్రబాబు పట్ల దారణంగా ప్రవర్థిస్తున్నారు’

    టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఆయన ఆరోగ్య పరిస్థిపై వైసీపీ ప్రభుత్వ వైఖరి అమానవీయంగా ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ కక్ష్య పనికిరాదన్నారు. వైద్యుల నివేదికలు పక్కన పెట్టి దారుణంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ఆరోగ్యంపై డాక్టర్ల నివేదిక బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

    వ్యూహం ట్రైలర్ విడుదల

    సంచలన దర్శకుడు ఆర్జీవీ వ్యూహం సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌లో చంద్రబాబు, పవన్ పాత్రలు ఉన్నాయి. జగన్ పాదయాత్ర, ఓదార్పు యాత్రకు సంబంధించిన సంఘటనలు ఉన్నాయి. ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. మరో 6 నెలల్లో ఏపీ ఎలక్షన్లు ఉన్న నేపథ్యంలో ఈ సినిమా పొలిటికల్ హీట్ పెంచుతోంది.

    సీఎం జగన్‌కు పిచ్చి ముదిరింది: లోకేష్

    సామర్లకోట బహిరంగ సభలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గట్టి కౌంటర్ ఇచ్చారు. నాలుగున్నరేళ్లుగా దోచుకోవ‌డం, దాచుకోవ‌డం, దాడులు చేయ‌డం త‌ప్పించి చేసిన అభివృద్ధి శూన్యం. సీఎంగా చేసిన మంచి ప‌ని ఒక్కటీ లేదు. దమ్ముంటే చెప్పాలి. అస‌లే సైకో అయిన జ‌గ‌న్‌కి అధికారమ‌దం ఎక్కింది. ఫ్రస్టేష‌న్ పీక్స్‌కి చేరి పిచ్చిగా వాగుతున్నాడు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారిపై జ‌గ‌న్ ప్రేలాప‌న‌లు చూస్తుంటే పిచ్చి ముదిరింద‌ని స్పష్టం అవుతోంది అని ఎద్దేవా చేశారు.

    పవన్- చంద్రబాబు పొత్తుపై సెటైర్లు

    పనవ్- చంద్రబాబు పొత్తుపై సీఎం జగ్ సెటైర్లు విసిరారు. ‘చంద్రబాబును చూస్తే గుర్తుకొచ్చేవి.. మోసాలు వెన్నుపోట్లు. చంద్రబాబు ప్రజల్లో ఉన్నా, జైళ్లో ఉన్నా ఒకటే. చంద్రబాబు మోసాల్లో పవన్ భాగస్వామి. పవన్ పార్టీ పెట్టి 15 ఏళ్లు గడుస్తోంది. ఇప్పటివరకు కనీసం గ్రామాల్లో ఆ పార్టీ జెండా మోసే కార్యకర్తే లేడు. పవన్ జీవితమంతా చంద్రబాబు భజన చేయడానికే సరిపోతుంది’ అంటూ ఎద్దేవా చేశారు.

    ‘రూ.1500 కోట్లకు పవన్‌ అమ్ముడుపోయారు’

    AP: జనసేన అధ్య­క్షుడు పవన్‌ కళ్యాణ్‌ రూ.1,500 కోట్లకు అమ్ము­డుపోయాడని ప్రజాశాంతి పార్టీ చీఫ్‌ కేఏ పాల్‌ ఆరోపించారు చెప్పారు. పవన్‌ రోజుకో మాట మాట్లాడతారని మండిపడ్డారు. ఒక రోజు ఎన్డీఏలో ఉన్నానంటాడని, మరొక రోజు లేనని చెబుతాడని విమర్శించారు. చంద్రబాబు స్టీల్‌ ప్లాంట్‌ కోసం ఏనాడు పోరాటం చేయలేదని ధ్వజమెత్తారు. ఆయన అదానీకి అమ్ముడుపోయాడని ఆరో­పించారు. చంద్రబాబు అమరావతి కడతానని కట్టలేదని, పోలవరం పూర్తి చేయలేదని, ప్రత్యేక హోదా సాధించలేదని మండిపడ్డారు.

    రెండు భాగాలుగా ‘హరిహరవీరమల్లు’

    పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహరవీరమల్లు’ చిత్రం రెండు భాగాలుగా రానున్నట్లు తెలుస్తోంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ హిస్టారికల్ స్టోరీ కావడంతో కథ పెద్దదిగా ఉంటుందని, అందుకే రెండు భాగాలుగా తీస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కేజీఎఫ్, బాహుబలి వంటి చిత్రాలు రెండు భాగాలుగా వచ్చి సూపర్ హిట్ కావడంతో హరిహరవీరమల్లు సైతం భారీ విజయం సాధిస్తుందని పవన్ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

    పోలీసులతో మీ మక్కెలు విరగ్గొట్టిస్తాం: పవన్

    మచిలిపట్నం వారాహి యాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఏపీని వైసీపీ రహిత రాష్ట్రంగా మార్చుతాం. మేం ఏమీ మర్చిపోలేదు. ఇదే పోలీసు స్టేషనులో పంచాయితీ పెడతాం మీకు. ఏ పోలీసులను మీరు ఇబ్బంది పెట్టారో అదే పోలీసులతో మీ మక్కెలు విరగ్గొట్టిస్తాం. కొల్లేరు ప్రజలకు జనసేన, టీడీపీ వచ్చి బలమైన న్యాయం చేస్తాం. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్ధులకు అసలు సర్టిఫికేట్‌లు ఇవ్వలేకపోయారు. ప్రింటింగ్ ప్రెస్‌లతో షేర్ కుదరలేదా?’ అని విమర్శించారు.

    పెడనలో పవన్ ఫ్లాప్ షో: జోగి రమేష్

    పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్రపై మంత్రి జోగి రమేష్ విమర్శలు గుప్పించారు. పెడనలో ప్రజల అటెన్షన్ కోసం పవన్ కల్యాణ్‌ ప్రయత్నించారని ఆరోపించారు. ‘సినిమా స్టైల్ లో కత్తులు, కటార్లు, రాళ్లతో దాడులు అని హడావిడి చేశారు. రెండు వేల మందితో దాడులు అన్నారు. పవన్‌ సభకు రెండు వేల మంది కూడా రాలేదు. అవనిగడ్డలో పవన్ ఫ్లాప్ షో. పెడనలో సూపర్ డూపర్ ప్లాప్ షో. జనసేన-టీడీపీ కలయిక వ్యాక్సిన్ కాదు పాయిజన్’ అంటూ ఎద్దేవా చేశారు.

    ఇవాళ ముదినపల్లే నుంచి వారాహి యాత్ర

    నేడు విజయవాడ- ముదినేపల్లిలో పవన్ కల్యాణ్‌ వారాహి యాత్ర కొనసాగనుంది. మచిలీపట్నం నుంచి సాయంత్రం 5 గంటలకు ముదినేపల్లికి పవన్ చేరుకోనున్నారు. ముదినేపల్లిలో బహిరంగసభలో ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. వారాహి యాత్రలో వైసీపీ ప్రభుత్వంపై పవన్ మాటల దాడి పెంచారు. 32 కేసులున్న జగన్ అవినీతిపై నీతులు చెబుతున్నారని విమర్శించారు. సమస్యలపై గళం విప్పిన నేతలను జైలుకు పంపించి జగన్ సైకోలాగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.