• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • శ్రీవారి దర్శనానికి 12 గంటలు

    తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. శ్రీవారి దర్శనానికి 12 గంటల వరకు సమయంపడుతోంది. వైకుంఠ కాంప్లెక్సుల్లోని 18 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 62,938 మంది భక్తులు దర్శించుకున్నారు. మరో 30,751 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శుక్రవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.24 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

    తిరుమలలో డ్రోన్ కలకలం

    తిరుమలలో డ్రోన్ కెమెరా కలకలం సృష్టించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న[ డ్రోన్ షాట్స్](url) ఏపీలో సంచలనం సృష్టిస్తున్నాయి. దీనిపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టతనిచ్చారు. డ్రోన్ విజువల్స్‌పై విచారణ జరుపుతున్నామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ విజువల్స్ అప్‌లోడ్ చేసిన వ్యక్తి హైదరాబాద్ వాసిగా గుర్తించామన్నారు. దీనిపై టీటీడీ విజిలెన్స్ కూడా స్పందించింది. వైరల్ అవుతున్న వీడియో ఒరిజినల్ కాదని.. దానిని ఫొరెన్సిక్ ల్యాబ్‌కు పంపామతి తెలిపారు. Major security breach as drone video of #TirumalaTirupati the … Read more

    కడప దర్గాను సందర్శించిన తలైవా

    సూపర్ స్టార్ రజినీకాంత్ ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ దర్శనీయ ప్రాంతాలను సందర్శిస్తున్నారు. కుమార్తె ఐశ్వర్యతో కలిసి తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. తిరుపతిలో పూర్తయ్యాక కడపలోని అమిన్ దర్గాకు చేరుకున్నారు. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌ కూడా తలైవాతో ఉన్నారు. దర్గాకు వచ్చిన రజినీకి నిర్వహకులు ఘన స్వాగతం పలికారు. కాగా, ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో విష్ణు విశాల్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో రజినీ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం … Read more