• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రొ కబడ్డీ లీగ్ 8వ సీజన్‌లో గెలుపెవరిది?

    గతేడాది డిసెంబర్ 22 నుంచి ప్రారంభమైన ప్రొ కబడ్డీ లీగ్ 8వ సీజన్ సెమీస్ దశకు చేరుకుంది. ఉత్కంఠగా సాగిన మ్యాచులు, అభిమానుల కేరింతలు, క్రీడాకారుల ప్రతిభ ఇలా అనేక అంశాల మేళవింపుగా కొనసాగిన ఈ క్రీడా సమరంలో చివరికి నాలుగు జట్లు సెమీస్ చేరాయి. ఆ జట్లు సెమీస్‌కి చేరడానికి గల కారణాలు ఏంటి? వారిలో విజేతగా నిలిచే అవకాశాలు ఎవరికీ ఉన్నాయో? ఒకసారి పరిశీలిద్దాం.

    క్వాలీఫై అయిన జట్లు ఆరు

    మొత్తం 12 జట్లు పాల్గొన ఈ లీగ్‌లో ఆరుజట్లు నాకౌట్ దశకు చేరాయి. వీటిలో పాయింట్ల పట్టికల్లో మొదటి, రెండు స్థానాలు సాధించిన పాట్నా పైరేట్స్, దబాంగ్ దిల్లీ సెమీస్ చేరాయి. ఎలిమినేటర్ 1 రౌండ్‌లో పుణేరి పల్టన్‌పై యూపీ యోధ 42-31 తేడాతో గెలుపొంది సెమీస్ బెర్తు ఖాయం చేసుకుంది. అలాగే ఎలిమినేటర్ 2 రౌండ్‌లో గుజరాత్ జెయింట్స్‌ను బెంగళూరు బుల్స్ 49-29 తేడాతో ఓడించి సెమీస్‌లోకి అడుగుపెట్టింది.

    సెమీస్‌ చేరిన జట్లు నాలుగు

    పాట్నా పైరేట్స్

    దబాంగ్ దిల్లీ

    యూపీ యోధ

    బెంగళూరు బుల్స్

    ఆయా జట్ల పాయింట్లు- ముఖ్యమైన ఆటగాళ్లు

    పాట్నా పైరేట్స్: ప్రొ కబడ్డీ లీగ్ సీజన్‌లో మంచి సక్సెస్‌ఫుల్ జట్టుగా పాట్నా పైరేట్స్‌కి పేరుంది. మొత్తం 8 సీజన్లలో 5 సార్లు ప్లే ఆఫ్స్‌కి చేరి వరుసగా సీజన్ 3, 4, 5 లలో విజేతగా నిలిచింది. ఈ జట్టు 8వ సీజన్‌లో 22 మ్యాచులు ఆడి 16 మ్యాచుల్లో గెలిచి 5 ఓడిపోయి పాయింట్ల పట్టికలో అగ్రస్థానం సాధించింది. ప్రశాంత్ కుమార్ రాయ్ పాట్నా జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ జట్టులో సచిన్ తన్వార్, మోను గోయత్ బెస్ట్ రైడర్లుగా, మహమ్మద్రిజ టాప్ డిఫెండర్‌గా కొనసాగుతున్నాడు.

    దబాంగ్ దిల్లీ: ఈ జట్టు ఇప్పటి వరకు ఒక్కసారి కూడ టైటిల్‌ని ముద్దాడనప్పటికీ ఈ సీజన్‌లో ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. 22 మ్యాచుల్లో 12 గెలిచి 6 ఓడిపోయింది. 4 మ్యాచులు టైగా ముగిసి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచి సెమీస్ చేరింది. ఈ జట్టుకు జోగిందర్ సింగ్ నర్వాల్ కెప్టెన్‌గా కొనసాగుతుండగా సందీప్ నర్వాల్, మంజిత్ చిల్లర్, విజయ్ మాలిక్ కీలక ఆటగాళ్లుగా ఉన్నారు.

    యూపీ యోధ: ఈ జట్టు టైటిల్‌ని నెగ్గనప్పటికీ ఎక్కువ సార్లు నాకౌట్ స్థాయికి చేరకుంది. యూపీ యోధ 22 మ్యాచులు ఆడి 10 విజయాలు, 9 పరాజయాలు నమోదు చేసుకుంది. 3 మ్యాచులు డ్రాగా ముగిశాయి. ఎలిమినేటర్ రౌండ్‌లో పుణేరి పల్టన్‌పై గెలుపొంది సెమీస్ చేరుకుంది. ఈ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న పర్‌దీప్ నర్వాల్ సీజన్‌లోనే బెస్ట్ రైడర్‌గా రాణిస్తున్నాడు. ఇతడు గత సీజన్‌లో వేరే జట్లకు కప్ కూడ అందించాడు. అలాగే ఈ జట్టులో నితీశ్ కుమార్, సురేందర్ గిల్ బెస్ట్ ప్లేయర్స్‌గా ఉన్నారు.

    బెంగళూరు బుల్స్: టాప్ రైడర్ పవన్ శరావత్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఈ జట్టు 8వ సీజన్‌లో అదరగొడుతుంది. మొత్తం 22 మ్యాచుల్లో 11 విజయాలు, 9 పరాజయాలు, 2 మ్యాచులు డ్రా అయ్యాయి. ఈ జట్టు సీజన్ 6లో విజేతగా, సీజన్ 2లో రనరప్‌గా నిలిచింది. డాంగ్లీ, పవన్ శరావత్ కీ ప్లేయర్లుగా ఉన్నారు. ఎలిమినేటర్ 2లో గుజరాత్ జెయింట్స్‌పై గెలుపొంది ఫైనకి చేరింది.

    వీరికే ఎక్కువ అవకాశాలు..

    ఈ సీజన్‌లో అత్యధిక విజయాలు నమోదు చేసుకున్న పాట్నా పైరేట్స్‌కే టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ జట్టు ఇప్పటికే 3సార్లు టైటిల్ గెలిచిన విశ్వాసంతో దూసుకెళ్తుంది. ప్రత్యర్థి జట్లను ఓడిస్తుంది. అలాగే బెంగళూరు బుల్స్, యూపీ యోధ కూడ గట్టి పోటినిచ్చే అవకాశం ఉంది.

    సెమీస్ మ్యాచులు ఎప్పుడు

    పాట్నా పైరేట్స్ x యూపీ యోధ – సెమీస్ 1(ఫిబ్రవరి 23)

    దబాంగ్ దిల్లీ x బెంగళూరు బుల్స్ – సెమీస్ 2(ఫిబ్రవరి 23)

    (ఈ మ్యాచులను స్టార్ స్పోర్ట్స్ లేదా డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో వీక్షించొచ్చు)

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv