• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సుడిగాలి సుధీర్ స్పీచ్.. రష్మి ఎమోషనల్

    నందు హీరోగా రష్మి హీరోయిన్‌గా కలసి నటించిన ‘బొమ్మ బ్లాక్‌బస్టర్’ చిత్రం ప్రి రిలీజ్ ఈవెంట్‌లో రష్మి ఎమోషనల్ అయింది. ఈ ఈవెంట్‌కు సుడిగాలి సుధీర్ అతిథిగా హాజరయ్యాడు. ఈ క్రమంలో సుధీర్ మాట్లాడుతూ.. రష్మి గారూ అనగానే రష్మి భావోద్వేగానికి గురైంది. రష్మి తదేకంగా సుధీర్ వైపే చూస్తూ ఎమోషనల్ అయింది. రష్మి చాలా మంచి మనసు ఉన్న వ్యక్తి అని, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ముందుంటుందని సుధీర్ ప్రశంసించాడు. ‘బొమ్మ బ్లాక్‌బస్టర్’ చిత్రం బ్లాక్‌బస్టర్ కావాలని సుధీర్ కోరుకున్నాడు.

    స్కూటీలో శబ్దాలు.. తెరిచి చూస్తే షాక్

    ఒక వ్యక్తికి సంబంధించిన స్కూటీ ముందు భాగం నుంచి శబ్ధాలు వినిపించడంతో అనుమానం వచ్చింది. ధైర్యం చేసి స్కూటీ ముందు భాగాన్ని తొలగిస్తుండగా.. షాకింగ్ దృశ్యం కనిపించింది. ముందు భాగంలో నాగుపాము దాగి ఉంది. అది చూసి స్కూటీ యజమాని బిత్తరపోయాడు. వెంటనే తేరుకుని స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించగా, అతడు వచ్చి స్క్రూడ్రైవర్ సాయంతో ఆ పామును బయటకు తీస్తాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

    ఒక్కటైన ఇద్దరు అందగత్తెలు

    కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్న మిస్ అర్జెంటీనా మరియానా వరేలా, మిస్ ఫ్యూర్టారికో ఫాబియోలా వాలెంటిన్‌లు ప్రస్తుతం ఒక్కటయ్యారు. తాజాగా వారు వివాహబంధంతో ఒక్కటైనట్లు ప్రకటించారు. తమ మధ్య ఉన్న ప్రేమను తెలియజేయడానికి ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ [వీడియో](url) నెట్టింట్లో వైరల్‌గా మారింది. కాగా వీరిద్దరి దేశాల్లోనూ స్వలింగ వివాహాలు చట్టబద్ధమే. దీంతో వీరిద్దరి పెళ్లికి ఎలాంటి అడ్డంకులు లేకుండా పోయాయి. https://www.instagram.com/reel/CkUOoo_glwy/?utm_source=ig_web_copy_link

    మునుగోడులో పరుగులు తీసిన కేఏ పాల్

    ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, మునుగోడు ఉప ఎన్నిక స్వతంత్ర అభ్యర్థి కేఏ పాల్ మునుగోడులో పరుగులు పెట్టారు. పోలింగ్ కేంద్రాల్లోపోలింగ్ సరళిని పరిశీలించి బయటకు పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) నెట్టింట్లో వైరల్‌గా మారింది. నియోజకవర్గంలో బిజీబిజీగా తిరుగుతూ సందడి చేశారు. కాగా మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో కేఏ పాల్ తన విన్యాసాలతో ప్రజలను ఆకట్టుకున్నారు. ప్రజలతో కలసి డ్యాన్స్ చేయడం, పాటలు పాడడం, సైకిల్ తొక్కడం వంటి చేష్టలతో నవ్వించారు. #KAPaul also running in the #Munugodu race … Read more

    చీరల్లో దాచిన రూ.4.1 కోట్లు స్వాధీనం

    ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు భారీగా అమెరికన్ [కరెన్సీ](url) స్వాధీనం చేసుకున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజా ఎయిర్‌పోర్ట్‌లో దుబాయ్ వెళ్తున్న ముగ్గురి బ్యాగులను తనిఖీ చేశారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. ముగ్గురు వ్యక్తులు రూ.4.1 కోట్ల విలువైన యూఎస్ డాలర్లతో పట్టుబడ్డారు. చీరలు, చెప్పులు, బ్యాగుల్లో దాచి తీసుకెళ్తుండగా కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్ట్ చేసి స్థానిక కోర్టులో హాజరు పర్చగా, వారికి జ్యుడీషియల్ కస్టడీ విధించారు. #WATCH | In a targeted op by AIU, … Read more

    సీఎం హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

    మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసర ల్యాండ్ అయ్యింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవటంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. షిల్లాంగ్ నుంచి ట్యువాకు వెళ్తుండగా దట్టమైన మేఘాలు ఆవరించడంతో ఉమియాంలోని ఒక కాలేజీ మైదానంలో హెలికాప్టర్‌ను సురక్షితంగా కిందకు దించారు. అనంతరం స్థానికులను పలకరిస్తూ, వారితో కలసి డిన్నర్ కూడా చేశాడు. ఇందుకు సంబంధించిన[ వీడియో](url)ను సంగ్మా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. What an adventure!•Emergency Landing at UCC, Umiam due to bad weather•Enjoyed the beautiful scenery … Read more

    దటీజ్ ఎన్టీఆర్; వీడియో వైరల్

    కర్నాటక అసెంబ్లీలో జరిగిన కన్నడ రాజ్యోత్సవ వేడుకల్లో యంగ్‌టైగర్ ఎన్టీఆర్ పాల్గొన్నారు. ఈ క్రమంలో ఓ అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. ఈ ఈవెంట్‌కు ఇన్ఫోసిస్ చైర్మన్ సుధానారాయణమూర్తి కూడా హాజరయ్యారు. తనకు కేటాయించిన కుర్చీలో కూర్చోమని నిర్వాహకులు కోరినా ఎన్టీఆర్ కూర్చోలేదు. అక్కడున్న కుర్చీలను తుడిచి సుధామూర్తిని కూర్చోబెట్టారు. ఆ తర్వాత ఆయన కుర్చీలో కూర్చున్నారు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) ప్రస్తుతం వైరల్‌గా మారింది. His Simplicity ??❤️#NTRajiniForAppu #NTRatಕರ್ನಾಟಕರಾಜ್ಯೋತ್ಸವ #NTRForAppu #PuneethRajkumar #DrPuneethRajkumar pic.twitter.com/N8b0R5j3Rr — Appu Cults (@appu_devotees) November … Read more

    ‘హరోం హర’ అంటున్న సుధీర్‌బాబు

    టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్‌బాబు ‘హరోం హర’ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ [వీడియో](url)ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఈ చిత్రాన్ని దర్శకుడు జ్ణానసాగర్ ద్వారక తెరకెక్కిస్తున్నారు. 1989లో కుప్పం ప్రాంతంలో జరిగిన ఓ యధార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ సినిమాగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. Just in case you missed it, here's … Read more

    దొంగలందు మంచి దొంగ వేరయా..

    దక్షిణాఫ్రికాకు చెందిన జ్వెల్లీ థిక్సో అనే వ్యక్తికి చెందిన ల్యాప్‌టాప్ చోరీకి గురైంది. కానీ కొంత సమయం తర్వాత చోరీ చేసిన దొంగ నుంచి ఓ ఈమెయిల్ వచ్చింది. ‘‘ నీ ల్యాప్‌టాప్ ఎత్తుకుపోయినందుకు క్షమాపణలు కోరుతున్నా. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా. నాకు గత్యంతరం లేకే ఈ పని చేశాను. నీ ల్యాప్‌టాప్‌లో ఉన్న రీసెర్చ్ ఫైల్స్ మెయిల్ చేశాను. ఇంకా అవసరమైన ఫైల్స్ ఉంటే పంపిస్తాను.’’ అంటూ దొంగ [మెయిల్](url) చేశాడు. నవ్వాలో, ఏడ్వాలో అర్థం కాని పరిస్థితిలో థిక్సో ఉన్నాడు. … Read more

    హైదరాబాద్ వచ్చేసిన మహేష్ బాబు

    రెండు వారాల పాటు తన కుటుంబసభ్యులతో కలసి విదేశీ యాత్రలో ఉన్న సూపర్‌స్టార్ మహేష్‌బాబు హైదరాబాద్ వచ్చేశారు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) నెట్టింట్లో వైరల్ గా మారింది. ‘ఎస్ఎస్ఎంబీ28’ సినిమా షూటింగ్‌లో మహేష్‌ పాల్గొననున్నట్లు సమాచారం. నవంబర్ నుంచి రెండో షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు దర్శకుడు త్రివిక్రమ్ ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ చిత్రంలో మహేష్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. Superstar @urstrulyMahesh is back in Hyderabad and will resume the shoot … Read more